నారాయణ స్వామి ఎం.ఎల్.ఏ
ABN , First Publish Date - 2022-08-16T05:42:29+05:30 IST
ఇంద్రసేన, ఐశ్వర్యరాజ్ జంటగా నటించిన పాన్ ఇండియా చిత్రం ‘శాసనసభ’. వేణు మడికంటి దర్శకుడు....
ఇంద్రసేన, ఐశ్వర్యరాజ్ జంటగా నటించిన పాన్ ఇండియా చిత్రం ‘శాసనసభ’. వేణు మడికంటి దర్శకుడు. తులసీరామ్ సాప్పని, షణ్ముగం సాప్పని నిర్మాతలు. ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించారు. ఎం.ఎల్.ఏ నారాయణ స్వామిగా ఆయన కనిపించనున్నారు. స్వాతంత్య్రదినోత్సవం సందర్భంగా ఈ చిత్రంలోని రాజేంద్ర ప్రసాద్ లుక్ని చిత్రబృందం ఆవిష్కరించింది. ‘‘ఇదో పొలిటికల్ డ్రామా. విలువలు, నిజాయతీ గల శాసనసభ్యుడు నారాయణ స్వామి పాత్రలో రాజేంద్ర ప్రసాద్ నటన అలరిస్తుంది. ఆయన ఇదివరకెప్పుడూ చేయని పాత్ర ఇది. యూనివర్సల్ కథాంశంతో రూపొందిన చిత్రం కాబట్టి పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తున్నామ’’ని నిర్మాతలు తెలిపారు.