Nani: ఏపీ ప్రభుత్వం టికెట్ ధర తగ్గించి ప్రేక్షకులను అవమానించింది

ABN , First Publish Date - 2021-12-23T18:42:06+05:30 IST

ఏపీ ప్రభుత్వం టికెట్ ధర తగ్గించి ప్రేక్షకులను అవమానించింది అంటూ నాని అభిప్రాయపడ్డారు. ఆయన హీరోగా నటించిన 'శ్యామ్ సింగ రాయ్' మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా హీరో నాని

Nani: ఏపీ ప్రభుత్వం టికెట్ ధర తగ్గించి ప్రేక్షకులను అవమానించింది

ఏపీ ప్రభుత్వం టికెట్ ధర తగ్గించి ప్రేక్షకులను అవమానించింది అంటూ నాని అభిప్రాయపడ్డారు. ఆయన హీరోగా నటించిన 'శ్యామ్ సింగ రాయ్' మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా హీరో నాని మీడియా సమావేశంలో మాట్లాడారు. ఏపీ ప్రభుత్వం టికెట్ ధరలను తగ్గించి ప్రేక్షకులను అవమానించింది. 10 మందికి ఉద్యోగం ఇచ్చే థియేటర్ కంటే పక్కనే ఉన్న కిరాణ కొట్టు కలెక్షన్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఏదీ మాట్లాడినా వివాదం అవుతుంది. టికెట్ ధరలు పెంచినా కొని సినిమా చూసే సామర్థ్యం ప్రేక్షకులకు ఉంది. టూర్‌కు తీసుకెళ్లే పిల్లల నుంచి ఉపాధ్యాయులు ఒక్కొక్కరి నుంచి 100 వసూలు చేస్తే ఒకరిని నువ్వు ఇవ్వలేవంటే అవమానించడమే. నా పేరు ముందు 'నేచురల్ స్టార్' తీసేద్దామనుకుంటున్నా..ప్రేక్షకులకు సినిమా చూపించడమే మా లక్ష్యం, లెక్కలు తర్వాత చూసుకుందాం.. అని నాని అన్నారు. ప్రస్తుతం నాని చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  



Updated Date - 2021-12-23T18:42:06+05:30 IST