డిసెంబర్ 24న ఏం జరగబోతోందో నాకు తెలుసు: నాని
ABN , First Publish Date - 2021-11-19T02:02:04+05:30 IST
న్యాచురల్ స్టార్ నాని, సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్లు హీరోహీరోయిన్లుగా నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై ప్రొడక్షన్ నెంబర్ 1గా వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో
న్యాచురల్ స్టార్ నాని, సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్లు హీరోహీరోయిన్లుగా నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై ప్రొడక్షన్ నెంబర్ 1గా వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. గురువారం ఈ చిత్ర టీజర్ను రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హీరో నాని మాట్లాడుతూ.. ‘‘రెండేళ్ల తర్వాత థియేటర్లలోకి కరెక్ట్ సినిమాతో వస్తున్నాను. క్రిస్మస్ మాత్రం మనదే. మంచి టీమ్ దొరికినప్పుడు ఎలాంటి సినిమా వస్తుందో చెప్పడానికి ఈ చిత్రమే ఉదాహరణ. ఇంత మంచి చిత్రాన్ని తీసినందుకు నిర్మాత వెంకట్గారికి థ్యాంక్స్. మీ అందరితో కలిసి ఎప్పుడెప్పుడు ఈ సినిమా చూస్తానా? అని నేను కూడా ఎదురుచూస్తున్నాను. ప్రతీ సినిమాలో కొత్తగా కనిపించాలని, కొత్త ఫేజ్ను మొదలుపెట్టాలని అనుకుంటాం. కానీ ప్రతీసారి వర్కవుట్ కాకపోవచ్చు. కానీ అన్ని సినిమాలకు పెట్టే శ్రమ మాత్రం ఒక్కటే. క్రిస్మస్ అనేది నాకు స్పెషల్. ‘ఎంసీఏ’ సినిమాతో వచ్చాను. ఆ సెంటిమెంట్ కూడా కలిసి వస్తుంది. ఇది ప్రేమ కథ. ఎపిక్ లవ్ స్టోరీ. నేను ఏ టెక్నీషియన్, నటీనటుల్లోనూ కొత్త పాత అని చూడను. కంటెంట్ మాత్రమే చూస్తాను. అందరినీ అలరించే సినిమాను చేయాలని అనుకుంటాం. శ్యామ్ అమ్మ తెలుగు అయితే నాన్న బెంగాలి. కథ విన్నప్పుడు నాకు ఓ హై వచ్చింది. ఇలా కనుక సినిమా తీస్తే బాగుంటుందని అనుకున్నాం. కానీ అనుకున్నదానికంటే కూడా సినిమా చాలా బాగా వచ్చింది. సాయిపల్లవితో ఇది వరకే ఎంసీఏతో హిట్ వచ్చింది. ఇప్పుడు డిసెంబర్ 24న ఏం జరగబోతోందో కూడా నాకు తెలుసు. హిట్ కాంబినేషన్గా మేం చాలా సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. ఎక్కువగా అర్థం కాకూడదనే టీజర్ను అలా కట్ చేశాం. ఇప్పటి నుంచి ప్రతీ సినిమాలో ఇది వరకు చూడని నానినే చూస్తారు. టీజర్ కంటే సినిమా వంద రెట్లు ఉంటుంది. మీ ఎనర్జీని దాచి పెట్టుకోండి. డిసెంబర్ 24న పండగ చేసుకుందాం.. క్రిస్మస్ మనదే’’ అని అన్నారు.