మహేష్ సినిమాలో Nandamuri హీరో.. క్లారిటీ వచ్చేసింది

ABN , First Publish Date - 2022-05-30T00:52:34+05:30 IST

సూపర్ స్టార్ మహేశ్ బాబు (Super Star Mahesh Babu) హీరోగా తెరకెక్కబోతున్న SSMB28 మూవీలో నందమూరి హీరో నటించబోతున్నాడనేలా.. కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ వార్తలపై స్వయంగా..

మహేష్ సినిమాలో Nandamuri హీరో.. క్లారిటీ వచ్చేసింది

సూపర్ స్టార్ మహేశ్ బాబు (Super Star Mahesh Babu) హీరోగా తెరకెక్కబోతున్న SSMB28 మూవీలో నందమూరి హీరో నటించబోతున్నాడనేలా.. కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ వార్తలపై స్వయంగా ఆ నందమూరి హీరోనే తన పీఆర్ టీమ్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. రీసెంట్‌గా వచ్చిన ‘సర్కారు వారి పాట’ (Sarkaru Vaari Paata) చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న మహేశ్ బాబు.. తన తదుపరి చిత్రంగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) దర్శకత్వంలో నటించబోతున్నారు. ‘SSMB28’ అనే వర్కింగ్ టైటిల్‌తో.. ఫిబ్రవరిలో గ్రాండ్‌గా లాంచ్ అయిన ఈ చిత్రం.. జూన్ నుంచి సెట్స్ మీదకు వెళ్లేందుకు రెడీ అవుతోంది. మహేశ్ బాబు సరసన  పూజా హెగ్డే (Pooja Hegde) హీరోయిన్‌గా నటించనుండగా.. నందమూరి హీరో తారకరత్న (TarakaRathna) ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటించబోతున్నట్లుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. 


అంతకుముందు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేసిన ‘అల వైకుంఠపురములో’ (Ala Vaikunthapurramuloo) చిత్రంలో కూడా యంగ్ హీరో సుశాంత్ (Sushanth) కీలక పాత్రలో నటించారు. అలానే ఇప్పుడు నందమూరి తారకరత్నని ఈ చిత్రం కోసం త్రివిక్రమ్ తీసుకొస్తున్నాడనేలా వార్తలు దర్శనమిస్తున్నాయి. అయితే ఈ వార్తలపై తారకరత్న క్లారిటీ ఇచ్చారు. ఈ వార్తలపై స్పందిస్తూ.. ‘‘ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తలు నమ్మవద్దు. నాకు ఎలాంటి ట్విట్టర్ ఖాతా లేదు. ఎవరో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి.. ఆ విధంగా ట్వీట్స్ చేస్తున్నారు. వాటిని ఎవరూ నమ్మకండి. గతంలో కూడా నేను ఇటువంటి వార్తలపై.. నా అఫీషియల్ ఫేస్‌బుక్ అకౌంట్‌లో తెలపడం జరిగింది. నాకు సంబంధించి ఎటువంటి విషయమైనా.. నా పీఆర్ టీమ్ ద్వారా అధికారికంగా తెలియజేస్తాను. దయచేసి ఫాల్స్ న్యూస్ స్ప్రెడ్ చేయవద్దని.. అలాగే వాటిని నమ్మవద్దని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను..’’ అని తారకరత్న తన పీఆర్ టీమ్ ద్వారా ఓ ప్రకటనను విడుదల చేశారు. దీంతో మహేష్ సినిమాలో నందమూరి హీరో అనే వార్తలకు ముగింపు పలికినట్లైంది.

Updated Date - 2022-05-30T00:52:34+05:30 IST