చై-సామ్ విడాకులపై నేను మాట్లాడినట్లుగా వస్తున్న వార్తల్లో నిజం లేదు: నాగార్జున

ABN , First Publish Date - 2022-01-28T00:01:07+05:30 IST

నాగచైతన్య, సమంత విడాకులకు సంబంధించి కింగ్ నాగార్జున మాట్లాడినట్లుగా వస్తున్న వార్తల్లో నిజం లేదని, అవి కేవలం రూమర్స్ మాత్రమేనని కింగ్ నాగార్జున సోషల్ మీడియా వేదికగా తెలిపారు. దయచేసి రూమర్స్‌ని వార్తలుగా నమ్మవద్దని

చై-సామ్ విడాకులపై నేను మాట్లాడినట్లుగా వస్తున్న వార్తల్లో నిజం లేదు: నాగార్జున

నాగచైతన్య, సమంత విడాకులకు సంబంధించి కింగ్ నాగార్జున మాట్లాడినట్లుగా వస్తున్న వార్తల్లో నిజం లేదని, అవి కేవలం రూమర్స్ మాత్రమేనని కింగ్ నాగార్జున సోషల్ మీడియా వేదికగా తెలిపారు. దయచేసి రూమర్స్‌ని వార్తలుగా నమ్మవద్దని ఆయన కోరారు. ‘‘సామాజిక మాద్యమాల్లో నా పేరుతో వస్తున్న కామెంట్స్‌లో నిజం లేదు. సమంత-నాగచైతన్యల విషయంలో నేను మాట్లాడినట్లు వస్తున్న వార్తలన్నీ అవాస్తవం. వదంతులను వార్తలుగా మలచవద్దని మీడియాకు విజ్ఞప్తి చేస్తున్నాను..’’ అని నాగార్జున ట్వీట్ చేశారు. 


అంతకుముందు.. ‘‘సమంత, నాగచైతన్యల మధ్య ఉన్న సమస్య ఏమిటనేది నాకూ తెలీదు. కానీ, సమంతే మొదట విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకుని అప్లయ్‌ చేసింది. ఆమె నిర్ణయాన్ని గౌరవించి నాగచైతన్య అంగీకారం తెలిపాడు. పరువు గురించి ఆలోచిస్తూ.. నేను ఎలా రిసీవ్ చేసుకుంటాననే దానిపైనే చైతన్య ఎక్కువగా బాధపడ్డాడు.’’అంటూ నాగార్జున అన్నట్లుగా వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ వార్తలపైనే నాగార్జున పై విధంగా స్పందించారు. 



Updated Date - 2022-01-28T00:01:07+05:30 IST