జర్నలిస్ట్పై దాడి.. సల్మాన్ ఖాన్కి కోర్టు సమన్లు
ABN , First Publish Date - 2022-03-23T16:09:23+05:30 IST
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్కి ఉన్న పాపులారిటీ తెలిసిందే. ఆయన సినిమాలతోనే కాకుండా వివాదాలతో సైతం వార్తల్లో..
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్కి ఉన్న పాపులారిటీ తెలిసిందే. ఆయన సినిమాలతోనే కాకుండా వివాదాలతో సైతం వార్తల్లో నిలుస్తుంటాడు. ఈ నటుడు కొన్నేళ్ల క్రితం కృష్ణ జింకలను వేటాడిన కేసు ఇంకా నడుస్తూనే ఉంది. తాజాగా మరో కేసులో సల్లు భాయ్పై కోర్టు సమన్లు జారీ అయ్యాయి.
సల్మాన్ ఖాన్ తనతో అనుచితంగా ప్రవర్తించాడని, దాడి చేశాడని అశోక్ పాండే అనే జర్నలిస్ట్ 2019లో ముంబైలో కేసు దాఖలు చేశారు. ఆ కేసును విచారించిన అంథేరి మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు మార్చి 22న ఈ బాలీవుడ్ నటుడికి సమన్లు జారీ చేసింది. ఐపీసీ సెక్షన్లు 504, 506 కింద నేరాలకి సంబంధించి విచారణ కోసం ఏప్రిల్ 5న కోర్టు హాజరు కావాలని ఆదేశించింది.
నివేదికల ప్రకారం.. సల్మాన్ ఖాన్, అతని అంగరక్షకుడు సైకిల్పై వెళుతున్నప్పుడు చిత్రీకరించేందుకు ప్రయత్నించగా తనపై దాడి చేశారని జర్నలిస్ట్ అశోక్ పాండే ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ సంఘటన ఏప్రిల్ 24, 2019న జరిగింది. అంతేకాకుండా అశోక్ పాండే వీడియో తీసే ముందు సల్మాన్ సమ్మతి కూడా తీసుకున్నట్లు అందులో తెలిపారు.