RC16: యశ్ నో.. రామ్ చరణ్ యస్..!
ABN , First Publish Date - 2022-09-10T22:34:05+05:30 IST
‘ఆర్ఆర్ఆర్’ తర్వాత రామ్ చరణ్ (Ram Charan) పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. ఉత్తరాది వారికి కూడా చేరువయ్యాడు. దీంతో భారత్లోని ప్రేక్షకులందరికి చేరువయ్యేలా చెర్రీ తన కథలు
‘ఆర్ఆర్ఆర్’ తర్వాత రామ్ చరణ్ (Ram Charan) పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. ఉత్తరాది వారికి కూడా చేరువయ్యాడు. దీంతో భారత్లోని ప్రేక్షకులందరికి చేరువయ్యేలా చెర్రీ తన కథలు ఉండాలనుకుంటున్నాడు. అందువల్ల కొత్తగా స్టోరీలను వింటున్నాడని సమాచారం. తాజాగా వేణు శ్రీరామ్, నర్తన్ (Narthan) అనే ఓ కన్నడ దర్శకుడు కథలు వినిపించారట. అయితే, నర్తన్ చెప్పిన కథవైపు చెర్రీ మొగ్గు చూపడని తెలుస్తోంది.
నర్తన్ గతంలో ‘ముఫ్తీ’ (Mufti) అనే సూపర్ హిట్ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. ఈ మూవీ ఇచ్చిన కిక్తో తన తర్వాతి ప్రాజెక్టుగా నర్తన్ నేవీ బ్యాక్ డ్రాప్తో ఓ కథను సిద్ధం చేసుకున్నాడట. ఈ స్టోరీని పాన్ ఇండియా హీరో యశ్(Yash) కు వినిపించగా రిజెక్ట్ చేశాడని సమాచారం. అయితే, అదే కథను రామ్ చరణ్కు చెప్పగా ఓకే చేశాడట. చెర్రీ కంటె ముందే నర్తన్ ఇదే స్టోరీని మెగాస్టార్కు పూర్తి స్క్రిప్ట్ను వినిపించాడని తెలుస్తోంది. చిరు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో చెర్రీకి చెప్పగా అంగీకరించాడని ఫిల్మ్ నగర్ వర్గాలు తెలుపుతున్నాయి. చరణ్ నటించే 16వ చిత్రమిదే. ఇక కెరీర్ విషయానికి వస్తే.. రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్నాడు. కియారా అడ్వాణీ హీరోయిన్గా నటిస్తుంది. ఈ చిత్రం వేసవి కానుకగా థియేటర్స్లోకి రానుంది. ఈ సినిమా పూర్తి కాగానే నర్తన్ ప్రాజెక్టును చరణ్ పట్టాలెక్కించనున్నాడు.