ఇకపై మా కు ఎన్నికలు జరగవద్దు: మోహన్‌బాబు

ABN , First Publish Date - 2021-10-11T05:29:24+05:30 IST

హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా మంచు విష్ణు గెలిచినట్లు అధికారిక ప్రకటించాక మోహన్‌బాబు మాట్లాడారు. ప్రెసిడెంట్‌కు చెప్పకుండా ఎవ్వరూ మీడియా ముందుకు వెళ్లవద్దని మోహన్‌బాబు సూచించారు.

ఇకపై మా కు ఎన్నికలు జరగవద్దు: మోహన్‌బాబు

హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా మంచు విష్ణు గెలిచినట్లు అధికారిక ప్రకటించాక మోహన్‌బాబు మాట్లాడారు. ప్రెసిడెంట్‌కు చెప్పకుండా ఎవ్వరూ మీడియా ముందుకు వెళ్లవద్దని మోహన్‌బాబు సూచించారు. మా సభ్యుల ఆదరణతో విష్ణు గెలిచాడని చెప్పారు. జరిగిందేదో జరిగిపోయిందంటూ అందరూ ఒక తల్లి బిడ్డల్లా కలిసిమెలిసి ఉందామని, వివాదాలకు ఫుల్‌స్టాప్‌ పెడదామని పిలుపునిచ్చారు. మా అభివృద్ధికి విష్ణు కట్టుబడి ఉంటాడని, తానిచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తాడని మోహన్‌బాబు చెప్పారు. చిరంజీవి, నాగార్జున, కృష్ణ, కృష్ణంరాజు, పవన్ కల్యాణ్ సహా అందరి ఆశీస్సులూ విష్ణుకుండాలని మోహన్‌బాబు కోరారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఆశీస్సులు కూడా విష్ణుకుంటాయని చెప్పారు. ఇకపై మా కు ఎన్నికలు జరగవద్దని, పెద్దలు ఏకగ్రీవం చేయాలని మోహన్‌బాబు సూచించారు. 

Updated Date - 2021-10-11T05:29:24+05:30 IST