నీతులు చెప్పలేదు... క్లాసులు పీకలేదు
ABN , First Publish Date - 2022-06-29T05:42:37+05:30 IST
‘‘నేను ఏ కథ చెప్పినా.. వినోదపు పూత పూసే చెబుతా. ‘పక్కా కమర్షియల్’ కూడా అలాంటి కథే’’ అన్నారు మారుతి...
‘‘నేను ఏ కథ చెప్పినా.. వినోదపు పూత పూసే చెబుతా. ‘పక్కా కమర్షియల్’ కూడా అలాంటి కథే’’ అన్నారు మారుతి. ఆయన దర్శకత్వం వహించిన చిత్రం ‘పక్కా కమర్షియల్’. గోపీచంద్, రాశీఖన్నా జంటగా నటించారు. ఈ శుక్రవారం విడుదల అవుతోంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మారుతి మాట్లాడుతూ ‘‘ఈ సినిమాలో హీరోని న్యాయవాదిగా చూపించాం. ‘లా’ అనేది ఓ మహా సముద్రం. న్యాయ వ్యవస్థలోని లోపాల్ని చూపిస్తూ ఎన్నో కథలు చెప్పొచ్చు. కానీ.. ఈ సినిమాలో మరీ అంత డెప్త్కి వెళ్లలేదు. నీతులు చెప్పలేదు. క్లాసులు పీకలేదు. కేవలం నవ్వించాం’’ అన్నారు. నిర్మాత బన్నీ వాసు మాట్లాడుతూ ‘‘కరోనా వల్ల... సినిమా పూర్తయినా, విడుదల చేయలేకపోయాం. వడ్డీలు పెరిగాయి. బడ్జెట్ పెరిగింది. కానీ.. గోపీచంద్కి ఉన్న మార్కెట్ వల్ల మంచి బిజినెస్ చేసుకోగలిగాం. థియేటర్ దగ్గర ఎంత పెద్ద హిట్టయితే అంత లాభాల్లో ఉంటాం. నాకెప్పుడూ ఎంటర్టైన్మెంట్ కథలే నచ్చుతాయి. వాటికి త్వరగా కనెక్ట్ అయిపోతాను. ‘పక్కా కమర్షియల్’ అలాంటి కథే’’ అన్నారు.