మూడంటే మూడే చేపలు
ABN , First Publish Date - 2022-08-20T05:30:00+05:30 IST
ముఖేష్ కుమర్ దర్శకత్వం వహించిన చిత్రం ‘మూడు చేపల కథ’. ఫృథ్వీ, అర్షద్ షేక్, బాలాజీ, సాయినాధ్ తదితరులు నటించారు.
ముఖేష్ కుమర్ దర్శకత్వం వహించిన చిత్రం ‘మూడు చేపల కథ’. ఫృథ్వీ, అర్షద్ షేక్, బాలాజీ, సాయినాధ్ తదితరులు నటించారు. ఇటీవల హైదరాబాద్లో జరిగిన ఓ కార్యక్రమంలో ట్రైలర్ ఆవిష్కరించారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘ఇదో రియలిస్టిక్ డాక్యుమెంటరీ క్రైమ్ థ్రిల్లర్. ఆంధ్రప్రదేశ్లోని కదిరి అనే ప్రాంతంలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందించాం. ‘మూడు చేపల కథ’ అనే టైటిల్ ఎందుకు పెట్టామన్నది సినిమా చూస్తే అర్థమవుతుంది. త్వరలోనే విడుదల తేదీ ప్రకటిస్తామ’’న్నారు.