Moodu Chepala Katha: త్వరలో.. ‘సమంత’ దర్శకుడి రెండో చిత్రం

ABN , First Publish Date - 2022-08-17T22:40:15+05:30 IST

‘సమంత’ (Samantha) అనే చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన ముఖేష్ కుమార్ (Mukesh Kumar).. ఆ చిత్రంతో దర్శకుడిగా మంచి గుర్తింపునే పొందారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతోన్న రెండో

Moodu Chepala Katha: త్వరలో.. ‘సమంత’ దర్శకుడి రెండో చిత్రం

‘సమంత’ (Samantha) అనే చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన ముఖేష్ కుమార్ (Mukesh Kumar).. ఆ చిత్రంతో దర్శకుడిగా మంచి గుర్తింపునే పొందారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతోన్న రెండో చిత్రం ‘మూడు చేపల కథ’ (Moodu Chepala Katha). రియలిస్టిక్ డాక్యుమెంటరీ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రస్తుతం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ ప్రచార కార్యక్రమాలను యమా జోరుగా నిర్వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ఆడియోని సంస్థ కార్యాలయంలో మేకర్స్ విడుదల చేశారు.


ఈ కార్యక్రమంలో దర్శకుడు ముఖేష్ కుమార్ మాట్లాడుతూ.. ‘‘ఆంధ్రప్రదేశ్‌లోని సత్యసాయి జిల్లా, కదిరిలో జరిగిన కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది. ఇందులోని కాన్సెప్ట్ ప్రతి ఒక్కరినీ అమితంగా ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది. ఈ సినిమాకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. తాజాగా విడుదలైన పాటలు కూడా అందరినీ మెప్పిస్తాయి. అతి త్వరలోనే చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని తెలిపారు. కాగా.. పృథ్వి, అర్షద్ షేక్, బాలాజీ, సాయినాథ్, హర్ష, రెహ్మాన్ తదితరులు నటించిన ఈ చిత్రాన్ని లియో ఫిల్మ్ కంపెనీ - పృథ్వి సినిమాస్ సంయుక్తంగా నిర్మించాయి.

Updated Date - 2022-08-17T22:40:15+05:30 IST