మమ్ముట్టికి కరోనా పాజిటివ్
ABN , First Publish Date - 2022-01-16T21:25:18+05:30 IST
కొత్త రకం పాత్రలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచిన నటుడు మమ్ముట్టి. అతడికి అన్ని ఇండస్ట్రీల్లోను అభిమానులున్నారు.
కొత్త రకం పాత్రలకు కేరాఫ్ అడ్రస్గా మారిన నటుడు మమ్ముట్టి. అతడికి అన్ని ఇండస్ట్రీల్లోను అభిమానులున్నారు. ‘‘యాత్ర’’ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు చేరువయ్యారు. మాలీవుడ్ సూపర్ స్టార్కు జనవరి 15న కరోనా సోకింది. దీంతో అతడు హీరోగా నటిస్తున్న ‘‘సీబీఐ-5’’ సినిమా షూటింగ్ వాయిదా పడింది. తమ అభిమాన హీరో కోవిడ్ బారిన పడటంతో త్వరగా కోలుకోవాలని అభిమానులందరూ ప్రార్థిస్తున్నారు.
గత కొన్ని నెలలుగా మమ్ముట్టి వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ‘‘సీబీఐ 5’’ సినిమా షూటింగ్ చేస్తుండగానే కోవిడ్ సోకినట్టు మాలీవుడ్ మీడియా తెలుపుతోంది. ప్రస్తుతం హీరో హోం ఐసోలేషన్ లో ఉన్నట్టు తెలిపారు. కరోనా సోకిందనే విషయాన్ని తెలుపుతూ సోషల్ మీడియాలో అతడు ఒక మెసేజ్ను పోస్ట్ చేశారు. ‘‘ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నప్పటికి నాకు జనవరి 15న కోవిడ్ సోకింది. నా ఆరోగ్యం నిలకడగానే ఉన్నప్పటికి కొద్దిపాటి జ్వరం మాత్రం ఉంది. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా నా ఇంటిలో ఐసోలేషన్లో ఉన్నాను. మీరుందరూ సురక్షితంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. ఎల్లప్పుడు మాస్క్ను తప్పక ధరించండి ’’ అని మమ్ముట్టి చెప్పారు.