Nagarjuna : వందో సినిమాకి దర్శకుడెవరో?

ABN , First Publish Date - 2022-09-15T18:54:46+05:30 IST

టాలీవుడ్ సీనియర్ హీరోల్లో మెగాస్టా్ర్ చిరంజీవి (Chiranjeevi), నటసింహ బాలకృష్ణ (Balakrishna) వంద సినిమాలకు పైగానే పూర్తి చేశారు. ఇంకా నాగ్ అండ్ వెంకీ ఆ ఫీట్ సాధించలేదు. ఈ ఇద్దరిలో వందకు దగ్గరగా ఉన్న హీరో మాత్రం నాగార్జునే (Nagarjuna). ఈయన 99వ చిత్రం ‘ది ఘోస్ట్’ (The Ghost) అక్టోబర్ 5 గ్రాండ్‌గా విడుదల కాబోతోంది.

Nagarjuna : వందో సినిమాకి దర్శకుడెవరో?

టాలీవుడ్ సీనియర్ హీరోల్లో మెగాస్టా్ర్ చిరంజీవి (Chiranjeevi), నటసింహ బాలకృష్ణ (Balakrishna) వంద సినిమాలకు పైగానే పూర్తి చేశారు. ఇంకా నాగ్ అండ్ వెంకీ ఆ ఫీట్ సాధించలేదు. ఈ ఇద్దరిలో వందకు దగ్గరగా ఉన్న హీరో మాత్రం నాగార్జునే (Nagarjuna). ఈయన 99వ చిత్రం ‘ది ఘోస్ట్’ (The Ghost) అక్టోబర్ 5 గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ప్రవీణ్ సత్తారు (Praveen Sattaru) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్ స్పై థ్రిల్లర్‌పై ఇండస్ట్రీలో అంచనాలు బాగానే ఉన్నాయి. దీని తర్వాత నాగ్ నటించబోయే వందో సినిమాపైనే ఉంది అందరి దృష్ణి. అభిమానులు ఈ సినిమా విషయంలో చాలా ఎగ్జైటింగ్‌గా ఉన్నారు. నాగార్జునకు ఆ సినిమా చాలా స్పెషల్ కాబట్టి, దాని కోసం గట్టిగానే కసరత్తులు జరుగుతున్నట్టు వినికిడి. 


తన కెరీర్‌లోనే ఎంతో ప్రాధాన్యం సంతరించుకున్న వందో సినిమా కోసం ఎవరో ఒక దర్శకుడితోనే కాకుండా. మొత్తం నలుగురితో కథా చర్చలు జరుపుతున్నట్టు ఆ మధ్య నాగార్జున తెలిపారు. వందో సినిమా అంటే ఓ స్థాయిలో ఉండాలని, దానికి తగ్గ కథకోసమే చూస్తున్నానని, సరైన కథ దొరకగానే ఈ ప్రాజెక్ట్ గురించి రివీల్ చేస్తానని, అప్పుడే దర్శకుడెవరనేదీ వెల్లడిస్తానని నాగ్ చెప్పారు. దాంతో ఆయన వందో చిత్రాన్ని దర్శకత్వం వహించేది ఎవరనే ఆసక్తితో అభిమానులున్నారు. ఈ నేపథ్యంలో ఒక దర్శకుడి పేరు ఇండస్ట్రీ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. 


ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) తో ‘గాడ్‌ఫాదర్’ (Godfather) చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న మోహన్ రాజా (Mohanraja) నే నాగ్ వందో చిత్రానికి దర్శకుడని వార్తలొస్తున్నాయి. ఇప్పటికే  తెలుగులో ‘హనుమాన్ జంక్షన్’ లాంటి సూపర్ హిట్ మూవీ తీశాడు. అతడు దర్శకత్వం వహించిన సినిమాల్లో దాదాపు అన్నీ రీమేక్సే. ‘జయం, అమ్మా నాన్న తమిళ అమ్మాయి, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, వర్షం, ఆజాద్ లాంటి ఎన్నో సినిమాల్ని తమిళంలో రీమేక్ చేసి అక్కడా హిట్స్ కొట్టాడు. ‘ఆజాద్’ సినిమా తప్ప మిగతా సినిమాలన్నిటిలోనూ అతడి తమ్ముడు రవినే హీరోగా నటించాడు. ఇక తన సొంత కథతో రవి హీరోగా నటించిన ‘తనీఒరువన్’ చిత్రం బ్లాక్ బస్టర్ అవడంతో.. మోహన్ రాజా పేరు మారుమోగిపోయింది. తర్వాత మళ్ళీ తన కథతోనే తీసిన ‘వేలైక్కారన్’ తోనూ హిట్టు కొట్టాడు. నాగార్జున కోసం అతడో ప్రత్యేక కథ రెడీ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ వార్తల్లో నిజానిజాలేంటో చూడాలి. 

Updated Date - 2022-09-15T18:54:46+05:30 IST