Ajay Devgn: బాలీవుడ్ హీరోను వెంబడించిన ప్రజలు

ABN , First Publish Date - 2022-12-04T22:18:25+05:30 IST

విభిన్న పాత్రలు, కొత్త కథలతో ప్రేక్షకులను అలరిస్తున్న నటుడు అజయ్ దేవగణ్ (Ajay Devgn). ‘దృశ్యం 2’ (Drishyam 2) హిట్‌తో మంచి జోష్‌లో ఉన్నాడు.

Ajay Devgn: బాలీవుడ్ హీరోను వెంబడించిన ప్రజలు

విభిన్న పాత్రలు, కొత్త కథలతో ప్రేక్షకులను అలరిస్తున్న నటుడు అజయ్ దేవగణ్ (Ajay Devgn). ‘దృశ్యం 2’  (Drishyam 2) హిట్‌తో మంచి జోష్‌లో ఉన్నాడు. అదే ఊపుతో వరుసగా ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తున్నాడు. ‘భోలా’ (Bholaa) షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. తాజాగా తెర వెనుక సంగతులను పంచుకున్నాడు. సినిమా సెట్‌లో జరిగిన ఘటనను వీడియో రూపంలో నెటిజన్స్‌తో పంచుకున్నాడు. వీడియోలో.. అజయ్ స్కూటర్ నడుపుతూ కనిపించాడు. అతడి వెనుక మరో వ్యక్తి కూర్చున్నాడు. ప్రజలందరు గుంపులుగా ఆ వాహనాన్ని వెంబడిస్తున్నారు. స్మార్ట్ ఫోన్స్‌తో రికార్డ్ చేస్తూ అదే పనిగా అరుస్తున్నారు. అజయ్ ఆ వీడియో కింద క్యాప్షన్ కూడా ఇచ్చాడు. ‘‘మంచి కారణాల రీత్యా ప్రజలు వెంబడిస్తే బాగుంటుంది. మీ నుంచి లభించిన ప్రేమకు ధన్యుడిని. వాహనాన్ని నడిపేట‌ప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. సినిమా షూటింగ్ కాబట్టి నేను ధరించలేదు’’ అని అజయ్ దేవగణ్ చెప్పాడు.

      

కోలీవుడ్ బ్లాక్ బాస్టర్ హిట్ ‘ఖైదీ’ (Kaithi) కి రీమేక్‌గా భోలా రూపొందుతుంది. ఈ చిత్రానికి అజయ్ దేవగణే దర్శకత్వం వహిస్తున్నాడు. ‘భోలా’ లో అజయ్ దేవగణ్, టబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ జంట చివరగా ‘దృశ్యం 2’ లోను నటించారు. ఇక అజయ్ దేవగణ్ కెరీర్ విషయానికి వస్తే.. ‘మైదాన్’ షూటింగ్‌ను గతంలోనే పూర్తి చేశాడు. ఈ చిత్రంలో ఫుట్‌బాల్  కోచ్ పాత్రను పోషించాడు. ఈ సినిమాను బొనీ కపూర్ నిర్మించాడు. త్వరలోనే మేకర్స్ సినిమాను విడుదల చేయనున్నారు. రోహిత్ శెట్టి దర్శకత్వం వహిస్తున్న ‘సర్కస్’ (Cirkus) లో అతిథి పాత్రలో మెరవనున్నాడు. భోలా పూర్తి కాగానే రోహిత్ శెట్టి తో ‘సింగం’ ప్రాజెక్టును పట్టాలెక్కించనున్నాడు. సింగం పార్ట్ 3 షూటింగ్‌‌ను ప్రారంభించనున్నాడు. ఈ చిత్రానికి సింగం ఎగైన్ అని టైటిల్ పెట్టారు. 



Updated Date - 2022-12-04T22:18:25+05:30 IST