మహేష్ బాబు వదిలిన ‘మిషన్ ఇంపాజిబుల్’ థియేట్రికల్ ట్రైలర్‌

ABN , First Publish Date - 2022-03-15T23:56:48+05:30 IST

టాలెంటెడ్ హీరోయిన్ తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రూపొందుతోన్న చిత్రం ‘మిషన్(మిషాన్) ఇంపాజిబుల్’. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ ఫేమ్ స్వరూప్ ఆర్ఎస్‌జె దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. తాజాగా ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను..

మహేష్ బాబు వదిలిన ‘మిషన్ ఇంపాజిబుల్’ థియేట్రికల్ ట్రైలర్‌

టాలెంటెడ్ హీరోయిన్ తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రూపొందుతోన్న చిత్రం ‘మిషన్(మిషాన్) ఇంపాజిబుల్’. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ ఫేమ్ స్వరూప్ ఆర్ఎస్‌జె దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. తాజాగా ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను సూపర్ స్టార్ మహేష్ బాబు విడుదల చేసి.. చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉండటమే కాకుండా.. సినిమాపై మంచి అంచనాలను క్రియేట్ చేసేదిగా ఉంది.


ట్రైలర్ విషయానికి వస్తే.. అవినీతిపరుడైన రాజకీయ నాయకుడు అరెస్ట్, ఆ త‌ర్వాత‌ బెయిల్ అనే అంశాన్ని చెబుతూ ఇన్వెస్టిగేటివ్ పాత్రికేయురాలిగా నటించిన తాప్సీ డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమైంది. ఆమె, ఆమె బృందం ఈ మిషన్‌ను నిర్వహించడం దాదాపు అసాధ్యమని భావించినప్పుడు, వారు తక్కువ సమయంలో ధనవంతుడిగా మారిన భార‌త‌దేశపు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావూద్ ఇబ్రహీంను పట్టుకోవడానికి ముగ్గురు పిల్లల సహాయం తీసుకుంటారు. అసాధ్యమైనది ఏమీ లేదని భావించే తాప్సీ.. పిల్ల‌ల ధైర్యాన్ని చూసి ఆశ్చ‌ర్య‌పోతుంది. వారు ఈ మిషన్‌ను ఎలా పూర్తి చేస్తారు అనేది కథలో కీలకాంశంగా మారుతుంది. సినిమా టైటిల్స్‌తో పిల్లలు చేసే కామెడీ.. ప్రేక్షకులకు మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వనుందనేది అర్థమవుతుంది. నిజమైన సంఘటన ఆధారంగా స్వరూప్ ఆర్ఎస్‌జె తనదైన తరహా రచన, టేకింగ్‌తో క‌మ‌ర్షియ‌ల్ అంశాల‌ను జోడించారు. సినిమాలో చేసిన పిల్లల యాక్టింగ్, తాప్సీ ఈ సినిమాకి ప్రధాన హైలెట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏప్రిల్ 1వ తేదీన చిత్రాన్ని విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

Updated Date - 2022-03-15T23:56:48+05:30 IST