ఆది సాయికుమార్ చిత్రంతో నయా హీరోయిన్ పరిచయం
ABN , First Publish Date - 2022-03-19T03:08:45+05:30 IST
శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 10గా నిర్మాత కెకె రాధామోహన్ ఓ పూర్తి వినోదభరిత చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నూతన దర్శకుడు ఫణి కృష్ణ సిరికి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో హీరోగా ఆది సాయికుమార్ నటిస్తుండగా..
శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 10గా నిర్మాత కెకె రాధామోహన్ ఓ పూర్తి వినోదభరిత చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నూతన దర్శకుడు ఫణి కృష్ణ సిరికి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో హీరోగా ఆది సాయికుమార్ నటిస్తుండగా.. మొదటి హీరోయిన్గా దిగంగన సూర్యవంశీని సెలక్ట్ చేసినట్లుగా రీసెంట్గా అధికారికంగా మేకర్స్ ప్రకటించారు. ఇప్పుడీ చిత్రంలో రెండో హీరోయిన్ కూడా ఉంటుందని, ఆ పాత్రకి నూతన హీరోయిన్ మిర్నా మీనన్ని తీసుకున్నట్లుగా శుక్రవారం అధికారికంగా మేకర్స్ వెల్లడించారు.
మిర్నా మీనన్ ఈ చిత్రంతోనే టాలీవుడ్కు పరిచయం అవుతున్నారు. గతంలో మలయాళం, తమిళంలో కొన్ని చిత్రాలలో నటించిన మిర్నా.. ఈ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించనుంది. ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్న ఇద్దరికీ తగిన ప్రాధాన్యత ఉంటుందని దర్శకనిర్మాతలు తెలిపారు. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రాన్ని లక్ష్మీ రాధామోహన్ సమర్పిస్తున్నారు. కాగా, ఈ చిత్రానికి ఆర్ ఆర్ ధృవన్ సంగీతం అందిస్తుండగా.. త్వరలోనే సినిమా టైటిల్, ఇతర వివరాలను వెల్లడిస్తామని మేకర్స్ తెలిపారు.