Singer Mika Singh: పంజాబీ అని చెప్పుకోవాలంటేనే సిగ్గుగా ఉంది

ABN , First Publish Date - 2022-05-30T18:14:08+05:30 IST

పంజాబీ సింగర్, రాజకీయవేత్త సిద్ధు మూస్ వాలాని కొందరు దుండగులు పంజాబ్‌లో కాల్చి చంపిన విషయం తెలిసిందే....

Singer Mika Singh: పంజాబీ అని చెప్పుకోవాలంటేనే సిగ్గుగా ఉంది

పంజాబీ సింగర్, రాజకీయవేత్త సిద్ధు మూస్ వాలా (Sidhu Moose Wala)ని కొందరు దుండగులు పంజాబ్‌లో కాల్చి చంపిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఆయన అభిమానులు ఈ గాయకుడి మరణ వార్త విని షాక్ గురయ్యారు. అజయ్ దేవ్‌గణ్, అర్జున్ కపూర్, విక్కీ కౌశల్, సారా అలీఖాన్ వంటి పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు సోషల్ మీడియాలో సిద్ధుకి నివాళి అర్పించారు. సిద్ధు మరణంపై తాజాగా మరో పంజాబీ సింగర్ మికా సింగ్ (Mika Singh) ఇన్‌స్టాగ్రామ్‌లో నివాళి అర్పించాడు.


మికా సింగ్ చేసిన పోస్ట్‌లో.. ‘నేను పంజాబీ అయినందుకు గర్వపడుతుంటానని ఎప్పుడూ చెబుతుంటాను. కానీ ఈ రోజు అలా చెప్పాలంటే సిగ్గు పడుతున్నాను. మంచి టాలెంట్, మంచి భవిష్యత్తు, పాపులారిటీ ఉన్న 28 ఏళ్ల యువకుడు సిద్ధు మూస్ వాలా పంజాబ్‌లో పంజాబీల చేతిలో చనిపోవడం దారుణం. ఎంతో బాధగా ఉంది. ఆయన ఆత్మకి దేవుడు శాంతి కలగజేయాలని కోరుకుంటున్నా. ఆయన ఫ్యామిలీకి అండగా నా ప్రార్థనలు ఉంటాయి. సిద్ధుని చంపిన క్రిమినల్స్‌పై గట్టి చర్యలు తీసుకోవాలని పంజాబ్ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నా’ అంటూ ఎమోషనల్‌గా రాసుకొచ్చాడు.


అలాగే.. సిధ్దుతో ఉన్న వీడియోని సైతం మికా సింగ్ షేర్ చేశాడు. అందులో.. రెస్టారెంట్‌లో ఉన్న మికా, సిద్ధు మరికొందరు స్నేహితులతో కలిసి డిన్నర్ చేస్తున్నారు. దీనికి.. ‘నిన్ను మిస్ అవుతాం సోదరా. మీరు త్వరగా వెళ్లిపోయారు. కానీ.. మీ పేరు, కీర్తి, మీరు సంపాదించిన గౌరవం, మీ రికార్డులను అభిమానులు ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. మీరు సృష్టించిన రికార్డులను జనాలు ఎప్పటికీ మర్చిపోలేరు. నేను, మీ అభిమానులు అందరం నిన్ను మిస్ అవుతూనే ఉంటాం. మీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాం’ అని మికా సింగ్ రాసుకొచ్చాడు.





Updated Date - 2022-05-30T18:14:08+05:30 IST