Pakka Commercial: ఒకే వేదికపై మెగాస్టార్, మెగా ప్రొడ్యూసర్
ABN , First Publish Date - 2022-06-23T14:39:43+05:30 IST
మాచో హీరో గోపీచంద్ (Gopichand) నటించిన లేటెస్ట్ సినిమా 'పక్కా కమర్షియల్' (Pakka Commercial). ఈ సినిమా రిలీజ్కు రెడీ అవుతున్న నేపథ్యంలో చిత్ర బృందం జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు.
ఒకే వేదికపై మెగాస్టార్ చిరంజీవి, మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సందడి చేయబోతున్నారు. అందుకు మ్యాచో హీరో గోపీచంద్ నటించిన ‘పక్కా కమర్షియల్’ చిత్ర వేడుక వేదిక కాబోతోంది. హీరో గోపీచంద్ (Gopichand) నటించిన లేటెస్ట్ సినిమా 'పక్కా కమర్షియల్' (Pakka Commercial). ఈ సినిమా రిలీజ్కు రెడీ అవుతున్న నేపథ్యంలో చిత్ర బృందం జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో త్వరలో నిర్వహించబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) రాబోతున్నారు. ఆయనతో పాటు మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కూడా వేదికను పంచుకోనున్నారు. ఈ ఇద్దరూ ఒకే వేదికపై కనిపించి చాలా రోజులు అవుతుంది. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో అల్లు, మెగా ఫ్యామిలీ మధ్య పొసగడం లేదు.. రెండు కుటుంబాల మధ్య ఏదో సైలెంట్ వార్ జరుగుతుంది అంటూ వార్తలు వస్తున్న తరుణంలో.. అందులో ఎలాంటి నిజం లేదని చెప్పడానికి పక్కా కమర్షియల్ ప్రీ రిలీజ్ వేడుక వేదికగా మారబోతుంది.
హీరో గోపీచంద్కు కూడా ఈ మధ్యకాలంలో సరైన హిట్ పడలేదు. దీంతో ఇప్పుడు మారుతి (Maruthi) దర్శకత్వంలో చేస్తున్న 'పక్కా కమర్షియల్' సినిమాపై ఆయన చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఈ మూవీని గోపీచంద్ మార్క్ యాక్షన్, మారుతి మార్క్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కించారు. రాశీ ఖన్నా (Rasi Khanna) హీరోయిన్గా నటించింది. హీరోహీరోయిన్లు ఇద్దరూ ఈ మూవీలో లాయర్లుగా కనిపించబోతున్నారు. ఇప్పటికే 'పక్కా కమర్షియల్' చిత్ర థియేట్రికల్ ట్రైలర్ రిలీజై అందరినీ ఆకట్టుకుంది.
కాగా, ఈ చిత్రాన్ని జూలై 1న విడుదల చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ తేదీని ఖరారు చేసింది చిత్ర బృందం. ఈ నెల 26వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్ను ఘనంగా నిర్వహిస్తున్నట్టుగా మేకర్స్ ప్రకటించారు. అంతేకాదు, ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి రాబోతున్నట్టుగా తెలియజేస్తూ దీనికి సంబంధించిన పోస్టర్ను విడుదల చేశారు. దాంతో ఇప్పుడు మూవీపై బజ్ ఇంకాస్త పెరిగింది. చూడాలి మరి గోపీచంద్కు 'పక్కా కమర్షియల్' మూవీ పక్కా హిట్ ఇస్తుందో లేదో. ఇక ఈ సినిమాలో సత్యరాజ్, అనసూయ పాత్రలు పోషించారు. అల్లు అరవింద్ (Allu Aravind) సమర్పణలో జీఏ2 పిక్చర్స్ - యూవీ క్రియేషన్స్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించాయి.