బాక్సాఫీస్ వద్ద సమరానికి సిద్ధమైన స్టార్ హీరోలు

ABN , First Publish Date - 2022-03-03T23:48:58+05:30 IST

కరోనాతో సినీ పరిశ్రమ అల్లోకల్లోలమైంది

బాక్సాఫీస్ వద్ద సమరానికి సిద్ధమైన స్టార్ హీరోలు

కరోనాతో సినీ పరిశ్రమ అల్లోకల్లోలమైంది. థియేటర్లు మూతబడ్డాయి. ప్రేక్షకులు సినిమా హాళ్లకు వచ్చి చిత్రాలను వీక్షించడానికి ఆసక్తి చూపడం లేదు. ఆడియన్స్ అబిరుచుల్లోను విపరీతమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ఓటీటీలకే వారు అలవాటుపడుతున్నారు. సినిమాలను విడుదల చేద్దామంటే థియేటర్లు లభించడం లేదు. ఒకవేళ చిత్రాలు విడుదలకు నోచుకున్నా బాక్సాఫీస్ వద్ద సమరం తప్పడం లేదు. భారీ బడ్జెట్, చిన్న చిత్రాలైనా సరే పోటీ లేకుండా విడుదల కావడం లేదు. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు అన్నిఇండస్ట్రీలోను ఇవే పరిస్థితులు ఉన్నాయి. 


బాలీవుడ్‌లో ఇద్దరు స్టార్ హీరోలు బాక్సాఫీస్ వద్ద ఒకేరోజు పోటీపడబోతున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన రెండు సినిమాలు ఒకే రోజు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అజయ్ దేవగణ్ హీరోగా ‘మైదాన్’ చిత్రం తెరకెక్కింది. బోనీ కపూర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రముఖ హైదరాబాదీ పుట్ బాల్ ఆటగాడు సయ్యద్ అబ్దుల్ రహీం జీవితం ఆధారంగా స్పోర్ట్ డ్రామాగా ఈ మూవీని రూపొందించారు. కరోనా విలయతాండవం చేయడంతో సినిమా విడుదల పలుమార్లు వాయిదా పడింది. చివరకు జూన్ 3, 2022న విడుదల చేస్తున్నామని చిత్ర బృందం ప్రకటించింది. సోలోగా రిలీజ్ చేద్దామనుకున్న ఈ చిత్రానికి యశ్ రాజ్ ఫిలింస్ నుంచి షాక్ తగిలింది. అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కిన ‘పృథ్వీరాజ్’ చిత్రాన్ని యశ్ రాజ్ సంస్థే తెరకెక్కించింది. జూన్ 3నే చిత్రాన్ని విడుదల చేయబోతున్నామని ఈ సంస్థ తెలిపింది. మొదటగా ‘పృథ్వీరాజ్’ ను జూన్ 10న విడుదల చేస్తామని పేర్కొంది. కానీ, ఏమైందో తెలియదు సినిమాను ఫ్రీ పోన్ చేసి ఓ వారం రోజులు ముందుగా విడుదల చేస్తామని ప్రకటించింది.

Updated Date - 2022-03-03T23:48:58+05:30 IST