Manisharma : గ్రీన్ఇండియా ఛాలెంజ్లో...
ABN , First Publish Date - 2022-07-26T16:25:47+05:30 IST
టాలీవుడ్లో ఎన్నో చిత్రాలకు అద్బుతమైన సంగీతం అందించి మెలోడీ బ్రహ్మగా గుర్తింపు తెచ్చుకున్నారు మణిశర్మ (Manisharma). ఒకప్పుడు టాప్ హీరోలందరికీ మణి మ్యూజిక్ ఉండాల్సిందే. అప్పట్లో ఆయన మ్యూజిక్ అందించిన ఆల్బమ్స్ అన్నీ ఛార్ట్ బస్టర్స్గా నిలిచాయి.
టాలీవుడ్లో ఎన్నో చిత్రాలకు అద్బుతమైన సంగీతం అందించి మెలోడీ బ్రహ్మగా గుర్తింపు తెచ్చుకున్నారు మణిశర్మ (Manisharma). ఒకప్పుడు టాప్ హీరోలందరికీ మణి మ్యూజిక్ ఉండాల్సిందే. అప్పట్లో ఆయన మ్యూజిక్ అందించిన ఆల్బమ్స్ అన్నీ ఛార్ట్ బస్టర్స్గా నిలిచాయి. ఇటీవల చిరంజీవి (Chiranjeevi) ‘ఆచార్య’ (Acharya) చిత్రానికి మ్యూజిక్ ఇచ్చిన మణిశర్మ ఇప్పుడు గుణశేఖర్ ‘శాకుంతలం’ (Shaakunthalam) చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందించే మొట్టమొదటి పౌరాణిక చిత్రం ఇదేకావడంతో భారీ అంచనాలున్నాయి. అలాగే సమంత (Samantha) కథానాయికగా నటిస్తు్న్న ‘యశోద’ (Yashoda) థ్రిల్లర్ చిత్రానికీ మణిశర్మ అద్భుతమైన ట్యూన్స్ రెడీ చేస్తున్నారు. ఇక అసలు విషయానికొస్తే.. మణిశర్మ తాజాగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ (Green India Challenge) లో పాల్గొని మొక్కలు నాటారు.
తెలంగాణ యంపీ సంతోష్ కుమార్ (Santhosh Kumar) చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో ఇప్పటికే ఎంతో మంది సినీ సెలబ్రిటీస్ పాల్గొని.. తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటి పర్యవరణానికి మేలు చేకూర్చడంలో భాగం అయ్యారు. కాగా ఇప్పుడు అదే ఛాలెంజ్ను మణిశర్మ స్వీకరించి మొక్కలు నాటడం విశేషం. తన గురువైన కీరవాణి నుంచి మణిశర్మ ఆ ఛాలెంజ్ను స్వీకరించారు. అలాగే ఈ ఛాలెంజ్ను యువ సంగీత దర్శకుడు తమన్ తోపాటు, తన కుమారుడు, సంగీత దర్శకుడయిన మహతి స్వరసాగర్ కు అప్పగించారు మణిశర్మ. యంపీ సంతోష్ కుమార్ చేపట్టిన ఈ బృహత్ కార్యంలో తను కూడా భాగస్వామిని కావడం ఆనందంగా ఉందని చెబుతూ.. పలు మొక్కలునాటారు మణిశర్మ. వృక్షో రక్షతి రక్షితః అనే సూక్తిని గుర్తుపెట్టుకొని తన అభిమానులందరూ మొక్కలు నాటాలని కోరారు మణిశర్మ.