జవాను సాయితేజ కుటుంబానికి అండగా.. మంచు విష్ణు హామీ

ABN , First Publish Date - 2021-12-10T00:04:23+05:30 IST

విధి నిర్వహణలో మృతి చెందిన జవాను సాయితేజ కుటుంబ సభ్యులను ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు పరామర్శించారు. మదనపల్లిలోని ఎస్‌బిఐ కాలనీలో ఉంటున్న సాయితేజ సతీమణి శ్యామలకు ఫోన్ చేసి మాట్లాడారు. యుక్త వయస్సులోనే

జవాను సాయితేజ కుటుంబానికి అండగా.. మంచు విష్ణు హామీ

విధి నిర్వహణలో మృతి చెందిన జవాను సాయితేజ కుటుంబ సభ్యులను ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు పరామర్శించారు. మదనపల్లిలోని ఎస్‌బిఐ కాలనీలో ఉంటున్న సాయితేజ సతీమణి శ్యామలకు ఫోన్ చేసి మాట్లాడారు. యుక్త వయస్సులోనే దేశ భద్రతను రక్షించే అత్యంత గొప్పదైన సీడీఎస్ చీఫ్ సెక్యూరిటీ అధికారిగా ఉన్న సాయితేజ అకాల మరణం పొందడం పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు. సాయితేజ ఇద్దరు పిల్లలు మోక్షజ్ఞ(05), దర్శిని(02) లను.. తన సొంత బిడ్డల వలే సంరక్షిస్తానని, శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల్లో వారికి పూర్తిగా ఉచితంగా చదువు, హాస్టల్ సౌకర్యం కల్పిస్తానని ఆయన హామీ ఇచ్చారు. 10 రోజుల్లో మదనపల్లికి వచ్చి కుటుంబ సభ్యులతో మాట్లాడతానని సాయితేజ సతీమణి శ్యామలకు మంచు విష్ణు తెలిపారు.

Updated Date - 2021-12-10T00:04:23+05:30 IST