టార్చర్ చేశారంటూ Mallika Sherawat కామెంట్స్.. Deepika Padukone చేసింది 15 ఏళ్ల క్రితమే నేను చేశానంటూ..
ABN , First Publish Date - 2022-07-14T20:42:40+05:30 IST
‘మర్డర్’ (Murder), ‘ఖ్వాయిష్’ (Khwahish) సినిమాల్లో గ్లామర్ రోల్స్ పోషించి అభిమానులను ఆకట్టుకున్న అందాల భామ మల్లికా శెరావత్ (Mallika Sherawat). ప్రత్యేక గీతాల్లోను నర్తించి ప్రేక్షకుల మదిని దోచుకుంది. తాజాగా మల్లిక మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ
‘మర్డర్’ (Murder), ‘ఖ్వాయిష్’ (Khwahish) సినిమాల్లో గ్లామర్ రోల్స్ పోషించి అభిమానులను ఆకట్టుకున్న అందాల భామ మల్లికా శెరావత్ (Mallika Sherawat). ప్రత్యేక గీతాల్లోను నర్తించి ప్రేక్షకుల మదిని దోచుకుంది. తాజాగా మల్లిక మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర కబుర్లను అభిమానులతో పంచుకుంది.
తన నటనను పరిగణనలోకి తీసుకోకుండా బాలీవుడ్లోని ఓ వర్గం, మీడియా తనను మానసికంగా టార్చర్ చేశారని మల్లికా శెరావత్ తెలిపింది. గత 20ఏళ్లుగా కథానాయికలు పోషించే పాత్రల్లోను మార్పులు వచ్చాయని చెప్పింది. ‘‘గతంలో హీరోయిన్స్కు రెండు రకాల పాత్రలు మాత్రమే రాసేవారు. మంచితనానికి మారు పేరుగా నిలిచే సతీ, సావిత్రి లాంటి పాత్రలతో పాటు, క్యారెక్టర్ లెస్ పాత్రల్లో కనిపించేలా చేసేవారు. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. మహిళలకు అన్ని రకాల పాత్రలు రాస్తున్నారు. కథానాయికలకు కూడా తాము పోషించే పాత్రలపై నమ్మకం ఉంది. నేను ‘మర్డర్’ లో గ్లామర్ రోల్లో కనిపించాను. ఆ సమయంలో అందరు ఆ సినిమాలోని ముద్దులు, బికినీల గురించే మాట్లాడారు. దీపికా పదుకొణె (Deepika Padukone) 2022లో ‘గెహ్రాయియా’ లో చేసిందే 15ఏళ్ల క్రితమే నేను చేశాను. అప్పట్లో అందరు సంకుచిత మనస్తత్వంతో ఆలోచించేవారు. బాలీవుడ్లోని ఓ వర్గం, మీడియా నన్ను మానసికంగా టార్చర్ చేశారు. నా నటన గురించి ఏ మాత్రం మాట్లాడేవారు కాదు. గ్లామర్ గురించి మాత్రమే ప్రస్తావించేవారు’’ అని మల్లికా శెరావత్ తెలిపింది.
మల్లికా శెరావత్ అనేక హిట్ సినిమాల్లో నటించింది. ‘దశావతరం’ (Dashavataram), ‘ప్యార్ కే సైడ్ ఎఫెక్ట్స్’(Pyaar Ke Side Effects), ‘వెల్కం’(Welcome) వంటి చిత్రాల్లో కనిపించింది. తాజాగా మల్లిక ‘ఆర్కే’ లో నటించింది. రజత్ కపూర్ దర్శకత్వం వహిస్తున్నాడు. కుబ్రా సైత్, రణ్వీర్ షోరే కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జులై 22న విడుదల కానుంది.