Mallika Sherawat: బాలీవుడ్ భామ ప్రధాన పాత్రలో.. హిస్టారికల్ బ్యాక్డ్రాప్లో..
ABN , First Publish Date - 2022-11-29T19:42:12+05:30 IST
బాలీవుడ్ భామ మల్లిక షేరావత్ (Mallika Sherawat) చాలాగ్యాప్ తర్వాత నటించిన తమిళ హిస్టారికల్ బ్యాక్డ్రాప్ చిత్రం ‘పాంబాట్టం’..
బాలీవుడ్ భామ మల్లిక షేరావత్ (Mallika Sherawat) చాలాగ్యాప్ తర్వాత నటించిన తమిళ హిస్టారికల్ బ్యాక్డ్రాప్ చిత్రం ‘పాంబాట్టం’ (Pambattam). తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్కు అనూహ్య స్పందన వచ్చింది. ఈ మూవీని దర్శకుడు వీసీ వడివుడయాన్ హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కించాడు. చారిత్రక నేపథ్యంలో ఒక సామ్రాజ్యానికి సంబంధించిన కథ. ఈ సామ్రాజ్య రాణిగా మల్లికా షెరావత్ తన నటనతో మెస్మరైజ్ చేస్తుందని చిత్రబృందం తెలిపింది.
ఈ చిత్రం గురించి దర్శకుడు వడివుడయన్ వివరిస్తూ.. ‘క్రీ.శ.1000, క్రీ.శ.1500, 1980 కాలాల్లో ఒక సామ్రాజ్యం ఎదుర్కొన్న ఒడిదొడుకుల ప్రధానంగా ఈ కథ సాగుతుంది. ఆయా కాలాలకు తగినట్టుగా కాస్ట్యూమ్స్, వాతావరణాన్ని కృత్రిమంగా సృష్టించాం. ఇందుకోసం భారీ మొత్తంలో ఖర్చు చేశాం. ఇందులో మల్లికా షెరావత్ ప్రధాన పాత్ర పోషించగా.. జీవన్ ద్విపాత్రాభినయం చేశారు. ఈ మూవీని అందరికీ నచ్చేలా తెరకెక్కించాం’ అని చెప్పుకొచ్చారు. కాగా.. రితికా సేన్, యాషికా ఆనంద్, సాయి ప్రియ, సుమన్, రమేష్ ఖన్నా తదితరులు ఈ చిత్రంలో ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని వైద్యనాథన్ ఫిల్మ్ గార్డెన్ బ్యానరుపై నిర్మాత వి.పళనివేల్ నిర్మించారు. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం ట్రైలర్ను హీరో ఆర్య రిలీజ్ చేశారు.