Rajinikanth: విలన్‌గా మణిరత్నం హీరో.. 31ఏళ్ల తర్వాత..

ABN , First Publish Date - 2022-09-04T22:33:37+05:30 IST

కోలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేసే నటుడు సూపర్ స్టార్ రజినీ కాంత్ (Rajinikanth). సినీ ఇండస్ట్రీలోకి కొత్తగా ఎంత మంది హీరోలు వచ్చినా రజినీ క్రేజ్‌ను మాత్రం ఎవరు మ్యాచ్ చేయలేరు. ‘తలైవా’

Rajinikanth: విలన్‌గా మణిరత్నం హీరో.. 31ఏళ్ల తర్వాత..

కోలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేసే నటుడు సూపర్ స్టార్ రజినీ కాంత్ (Rajinikanth). సినీ ఇండస్ట్రీలోకి కొత్తగా ఎంత మంది హీరోలు వచ్చినా రజినీ క్రేజ్‌ను మాత్రం ఎవరు మ్యాచ్ చేయలేరు. ‘తలైవా’ చివరగా ‘పెద్దన్న’ లో నటించాడు. ఈ చిత్రం యావరేజ్ టాక్‌తోనే బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించింది. రజినీ ఈ మధ్యనే ‘జైలర్’ (Jailer) ను పట్టాలెక్కించాడు. ఈ మూవీ షూటింగ్ దశలో ఉండగానే మరో ప్రాజెక్టుకు పచ్చ జెండా ఊపాడు. ఈ సినిమాకు ‘తలైవర్-170’ అని వర్కింగ్ టైటిల్ పెట్టారు. ఈ చిత్రంలో ఓ స్టార్ హీరో నటిస్తున్నాడని కోలీవుడ్ మీడియా తెలుపుతోంది.   


‘తలైవర్-170’ ను లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది. అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రంలో విలన్ పాత్ర కోసం మేకర్స్ స్టార్ హీరో అరవింద్ స్వామి (Arvind Swamy) ని సంప్రదించారట. ప్రస్తుతం అతడితో చర్చలు జరుపుతున్నారట. ఈ విషయంపై అరవింద్ స్వామి మాత్రం స్పందించలేదు. గతంలో వీరిద్దరు మణిరత్నం దర్శకత్వం వహించిన ‘దళపతి’ (Dalapathi) లో నటించారు. ఆ తర్వాత ఇద్దరూ కలసి ఏ సినిమా చేయలేదు. ఒక వేళ ఈ వార్తలు కనుక నిజమైతే 31ఏళ్ల తర్వాత వీరిద్దరు కలసి చేయబోయే సినిమా ఇదే అవుతుంది. ఇక రజినీ ప్రస్తుతం నటిస్తున్న ‘జైలర్’ విషయానికి వస్తే.. ఈ చిత్రానికి నెల్సన్ దిలీప్‌కుమార్ (Nelson Dilipkumar) దర్శకత్వం వహిస్తున్నాడు. కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నాడు. సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుంది. ఈ చిత్రంలో జై, వసంత్ రవి, రమ్య కృష్ణ, తమన్నా భాటియా, యోగి బాబు తదితరులు నటిస్తున్నారు. ‘జైలర్’ ఫస్ట్‌‌లుక్‌ ఈ మధ్యే విడుదలైంది. ఈ లుక్‌కు అభిమానుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది.

Updated Date - 2022-09-04T22:33:37+05:30 IST