Mahesh: మహేశ్‌ –త్రివిక్రమ్‌ హ్యాట్రిక్‌ సినిమా ‘సైన్యం’ ఎందుకు ఆగింది?

ABN , First Publish Date - 2022-06-18T21:19:22+05:30 IST

‘అతడు’, ‘ఖలేజా’ చిత్రాల తర్వాత హ్యాట్రిక్‌ సినిమాగా వీరిద్దరి కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. జూలైలో రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కానుందని ఇటీవల నిర్మాణ సంస్థ వెల్లడించింది. అయితే మహేశ్‌ – త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో హ్యాట్రిక్‌ చిత్రం పదేళ్ల క్రితమే రావాల్సి ఉంది. మహేష్‌బాబు, త్రివిక్రమ్‌ కలిసి ‘సైన్యం’ పేరుతో ఓ సినిమా అప్పట్లో ఖరారైంది. భారీ బడ్జెట్‌తో నిర్మాత ఎం.ఎస్‌.రాజు ఈ సినిమాను రూపొందించాలనుకున్నారు.

Mahesh: మహేశ్‌ –త్రివిక్రమ్‌ హ్యాట్రిక్‌ సినిమా ‘సైన్యం’ ఎందుకు ఆగింది?

‘అతడు’, ‘ఖలేజా’ చిత్రాల తర్వాత హ్యాట్రిక్‌ సినిమాగా వీరిద్దరి కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. జూలైలో రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కానుందని ఇటీవల నిర్మాణ సంస్థ వెల్లడించింది. అయితే మహేశ్‌ – త్రివిక్రమ్‌ (Mahesh -trivikram- Ms raju) కాంబినేషన్‌లో హ్యాట్రిక్‌ చిత్రం పదేళ్ల క్రితమే రావాల్సి ఉంది. మహేష్‌బాబు, త్రివిక్రమ్‌ కలిసి ‘సైన్యం’ పేరుతో ఓ సినిమా అప్పట్లో ఖరారైంది. భారీ బడ్జెట్‌తో నిర్మాత ఎం.ఎస్‌.రాజు ఈ సినిమాను రూపొందించాలనుకున్నారు. ఈ సినిమాకు సంబంధించి స్ర్కిప్ట్‌, ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ చాలా రోజులపాటు జరిగిందట. అయితే అనివార్య కారణాల వల్ల ఈ సినిమా ఆగిపోయిందని శనివారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఎమ్మెస్‌ రాజు తనయుడు సుమంత్‌ అశ్విన్‌ (Sumanth aswin) తెలిపారు. అయితే వార్త బయటికొచ్చినప్పటి నుంచి మరో వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. త్రివిక్రమ్‌ అప్పుడు అనుకున్న కథతోనే ఎస్‌ఎస్‌ఎంబీ 28ను హ్యాట్రిక్‌ సినిమాగా తెరకెక్కించనున్నారా? అన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మహేశ్‌–త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో రానున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. పూజాహెగ్డే కథానాయిక. తమన్‌ సంగీతం అందిస్తున్నారు. (Mahesh - trivikram ms raju movie stopped)

Updated Date - 2022-06-18T21:19:22+05:30 IST