Mahesh Babu: అభిమానులకు మహేశ్ లేఖ!
ABN , First Publish Date - 2022-05-07T23:57:15+05:30 IST
అభిమానులను ఉద్దేశించి మహేశ్బాబు రాసిన ఓ లేఖ ప్రస్తుతం నెట్టింట వైలర్ అవుతోంది. ‘సర్కారు వారి పాట’ సినిమా విడుదల సందర్భంగా మహేశ్ ఈ లేఖ విడుదల చేశారు. ‘‘ప్రియమైన అభిమానులకు, మిత్రులకు పరశురామ్ దర్శకత్వం వహించిన ‘సర్కారు వారి పాట ఈ నెల 12న విడుదల కానుంది.
అభిమానులను ఉద్దేశించి మహేశ్బాబు (Mahesh Babu) రాసిన ఓ లేఖ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ‘సర్కారు వారి పాట’ (Sarkaru Vaari Paata) సినిమా విడుదల సందర్భంగా మహేశ్ ఈ లేఖ విడుదల చేశారు. ‘‘ప్రియమైన అభిమానులకు, మిత్రులకు పరశురామ్ (Parasuram) దర్శకత్వం వహించిన ‘సర్కారు వారి పాట’ ఈ నెల 12న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పాటలు, ట్రైలర్లకు విశేష ఆదరణ లభించింది. భారీ అంచనాల మధ్య విడుదల కానున్న ఈ చిత్రాన్ని ప్రతి ఒక్కరూ థియేటర్లలోనే చూసి మీ స్పందన తెలియజేయగలరు. తదుపరి హారికా అండ్ హాసిని క్రియేషన్స్ (Haarika & Hassine Creations) పతాకంపై త్రివిక్రమ్ (Trivikram) దర్శకత్వంలో రానున్న సినిమా రెగ్యులర్ షూటింగ్ జూన్లో ప్రారంభం కానుంది’’ అని మహేశ్ ఆ లేఖలో పేర్కొన్నారు.
మహేశ్బాబు, కీర్తి సురేశ్ (Keerthi Suresh) జంటగా నటించిన ఈ చిత్రానికి పరశురామ్ దర్శకత్వం వహించారు. జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్, మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మించాయి. నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మాతలు. తమన్ (Thaman) సంగీతం అందించారు.