Mahesh - Trivikram: మూవీపై నిర్మాత ట్వీట్ వైరల్..
ABN , First Publish Date - 2022-06-11T15:56:50+05:30 IST
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'సర్కారు వారి పాట' (Sarkaru Vaari Paata). ఈ చిత్రం మహేష్ కెరీర్లో మరో కమర్షియల్ హిట్గా నిలిచింది.
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'సర్కారు వారి పాట' (Sarkaru Vaari Paata). ఈ చిత్రం మహేష్ కెరీర్లో మరో కమర్షియల్ హిట్గా నిలిచింది. అయితే, మహేష్ ప్రస్తుతం దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas)తో ఓ భారీ చిత్రాన్ని చేయబోతున్నారు. ఇటీవలే ఫైనల్ స్క్రిప్ట్ను కూడా త్రివిక్రమ్..మహేష్కు వినిపించాడు. సెకండ్ హాఫ్లో కొన్ని సలహాలు ఇవ్వగా..ఇప్పుడు వాటి మార్పులు చేర్పులపై వర్క్ చేస్తున్నారట త్రివిక్రమ్.
అయితే, సర్కారు వారి పాట రిలీజైయ్యాక మహేష్ - త్రివిక్రమ్ మూవీ త్వరగానే సెట్స్పైకి వస్తుందని భావించారు. కానీ, మహేశ్ సూచించిన సలహాలతో ఇంకాస్త స్క్రిప్ట్ కోసమే సమయం పడుతుందని సమాచారం. కానీ, అభిమానులు మాత్రం ఆగడం లేదు. త్వరగా ఈ మూవీ అప్డేట్స్ కావాలి.. అంటూ సోషల్ మీడియాలో మేకర్స్ను కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే కొందరు మహేష్ అభిమానులు ట్వీట్స్ కూడా చేస్తున్నారు.
ఇలా ఓ అభిమాని చేసిన ట్వీట్కు చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ (Suryadevara Nagavamsi) స్పందించారు. అభిమాని ట్వీట్తో మహేష్ సినిమా అప్డేపై క్లారిటీ ఇచ్చారు. 'అభిమానుల ఆత్రుత అర్ధం చేసుకోగలం. కానీ, ఏదైనా సమయం వచ్చినప్పుడే చెబితే శ్రేయస్కరంగా ఉంటుందని మేము భావిస్తున్నాము'.. అని తెలిపారు.
'అందుకే, ఎప్పుడు పడితే అప్పుడు అప్డేట్స్ అందించలేము.. దాదాపు 12 ఏళ్ళు తర్వాత మహేష్ గారు త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్నారు. అలాంటి సినిమాకి ప్రతీది స్పెషల్గానే ఉండాలి. కాబట్టి అలాంటి అప్డేట్స్ను స్పెషల్ డే కి ప్లాన్ చేసి రిలీజ్ చేస్తాము.. ఖచ్చితంగా మహేష్ - త్రివిక్రమ్ కాంబో చిత్రం అందరికీ ఒక మరపురాని సినిమాగా నిలుస్తుంది'.. అని తెలిపారు.