ఒక సాంగ్ మినహా.. ‘సర్కారు వారి పాట’ తాజా అప్‌డేట్

ABN , First Publish Date - 2022-04-12T21:59:51+05:30 IST

సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతోన్న చిత్రం ‘సర్కారు వారి పాట’. పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం ఒక పాట మినహా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్నట్లుగా మేకర్స్

ఒక సాంగ్ మినహా.. ‘సర్కారు వారి పాట’ తాజా అప్‌డేట్

సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతోన్న చిత్రం ‘సర్కారు వారి పాట’. పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం ఒక పాట మినహా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్నట్లుగా మేకర్స్ మంగళవారం అధికారికంగా ప్రకటించారు. మే 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. షూటింగ్ పూర్తయిన సందర్భంగా మేకర్స్ ప్రమోషన్ కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అలాగే మిగిలి ఉన్న పాటను కూడా త్వరలోనే చిత్రీకరించనున్నారట.


సెన్సేషనల్ సంగీత దర్శకుడు ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుండి ఇప్పటికే విడుదలైన రెండు పాటలు చార్ట్ బస్టర్స్‌గా రికార్డులు సృష్టించాయి. మొదటి పాటగా విడుదలైన ‘కళావతి’ మళ్ళీ మళ్ళీ పాడుకునే పాటగా నిలిచి రికార్డ్ వ్యూస్‌ని సొంతం చేసుకొని మ్యూజికల్ ప్రమోషన్స్‌కు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చింది. సూపర్ స్టార్ మహేష్ బాబు కుమార్తె సితార ఘట్టమనేని ఫస్ట్ అప్పియరెన్స్‌తో వచ్చిన రెండో పాట ‘పెన్ని’ సాంగ్ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. సితార క్యూట్ అండ్ ట్రెండీ డ్యాన్స్‌లతో ప్రేక్షకులని మెస్మరైజ్ చేసింది. సితార అప్పియరెన్స్ అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకుంది. సినిమా విడుదలకు సరిగ్గా నెల రోజులు ఉండటంతో చిత్ర యూనిట్ రెగ్యులర్ అప్‌డేట్స్‌తో ప్రేక్షకులముందుకు రానున్నారు. కాగా.. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు.  

Updated Date - 2022-04-12T21:59:51+05:30 IST