యంగ్ హీరో అడివి శేష్ (Adivi Sesh) కథానాయకుడిగా తెరకెక్కుతోన్న పాన్ ఇండియా చిత్రం ‘మేజర్’ (Major). శశికిరణ్ తిక్కా (Sashi Kiran Tikka) దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ చిత్రం జూన్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. మహేష్ బాబు జీఏంబీ ఎంటర్టైన్మెంట్(GMB Entertainment), ఏ ప్లస్ ఎస్ మూవీస్ (A+S Movies) తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ (Sony Pictures International Productions) భారీగా నిర్మిస్తున్న ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ని సోమవారం హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో అభిమానుల సమక్షంలో సూపర్ స్టార్ మహేష్ బాబు (Super Star Mahesh Babu) విడుదల చేశారు. 26/11 హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ (Major Sandeep Unnikrishnan) జీవితం ఆధారంగా రూపొందిన ఈ చిత్ర ట్రైలర్ ప్రతి ఫ్రేమ్ అద్భుతంగా వుంది. మేజర్ సందీప్ బాల్యం, యవ్వనం, లవ్ లైఫ్, వార్ .. ఇలా ప్రతీదీ ట్రైలర్లో చూపించారు. 26/11 ఎటాక్ విజువల్స్ నెక్స్ట్ లెవల్లో వున్నాయి. అడివి శేష్ మేజర్ సందీప్గా పరకాయ ప్రవేశం చేశారు. ప్రకాష్ రాజ్ (Prakash Raj) వాయిస్, డైలాగ్స్, ఆయన నటన ఈ ట్రైలర్కే హైలెట్లా ఉంది.
ట్రైలర్ విడుదల అనంతరం మహేష్ బాబు మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమా టీమ్ని చూస్తే చాలా గర్వంగా వుంది. మేజర్ ట్రైలర్ చూసినప్పుడు ప్రేక్షకుల రియాక్షన్ చూసి చాలా హ్యాపీగా అనిపించింది. ఈ సినిమా చూశాను. కొన్ని సీన్లు చూస్తున్నపుడు గూస్ బంప్స్ వచ్చాయి. చివరి 30 నిమిషాలు నా గొంతు తడారిపోయింది. సినిమా పూర్తయిన తర్వాత ఏం మాట్లాడలేకపోయాను. రెండు నిమిషాల మౌనం తర్వాత శేష్ని హాగ్ చేసుకున్నాను. బయోపిక్ (Biopic) తీయడం చాలా బాధ్యతతో కూడుకున్నది. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ లాంటి వీరుడి కథ చెప్పినపుడు ఆ బాధ్యత ఇంకా పెరుగుతుంది. మేజర్ టీం మొత్తం ఆ బాధ్యతని చక్కగా నిర్వహించారు. రెండేళ్ళుగా మేజర్ టీమ్ నాకు థ్యాంక్స్ చెబుతున్నారు. కానీ ఇంత గొప్ప సినిమాని ఇచ్చిన మేజర్ టీమ్కి నేను థ్యాంక్స్ చెప్పాలి. జూన్ 3న మేజర్ వస్తుంది. తప్పకుండా మీరు ప్రేమించే సినిమా అవుతుంది. కో ప్రొడ్యుసర్ అనురాగ్ (Anurag) మాట్లాడుతూ నేను రిస్క్ చేస్తానని చెప్పారు. కానీ నేను రిస్క్ చేయను. నాలుగేళ్ళుగా నేను ఏది పట్టుకున్నా బ్లాక్బస్టరే. శేష్ చేసే సినిమాలు నాకు చాలా ఇష్టం. మేజర్ సినిమా కూడా అద్భుతంగా ఉండబోతుంది’’ అన్నారు.