Mahesh Babu : మళ్ళీ కుటుంబ సమేతంగా వెకేషన్‌లో..

ABN , First Publish Date - 2022-05-22T19:10:12+05:30 IST

సూపర్‌స్టార్ మహేశ్‌బాబు (Maheshbabu) ఇటీవల ‘సర్కారువారి పాట’ (sarkaruvaari paata) చిత్రంతో అభిమానుల్ని పలకరించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి డివైడ్ టాక్ వచ్చినప్పటికీ.. మంచి వసూళ్ళను రాబట్టి.. బాక్సాఫీస్ వద్ద హిట్‌గా నిలిచింది. తదుపరిగా మహేశ్.. త్రివిక్రమ్ (Trivikram) దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. SSMB 28 గా పిలుచుకుంటున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జూలై నుంచి మొదలు కానుంది.

Mahesh Babu : మళ్ళీ కుటుంబ సమేతంగా వెకేషన్‌లో..

సూపర్‌స్టార్ మహేశ్‌బాబు (Maheshbabu) ఇటీవల ‘సర్కారువారి పాట’ (sarkaruvaari paata) చిత్రంతో అభిమానుల్ని పలకరించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి డివైడ్ టాక్ వచ్చినప్పటికీ.. మంచి వసూళ్ళను రాబట్టి.. బాక్సాఫీస్ వద్ద హిట్‌గా నిలిచింది. తదుపరిగా మహేశ్.. త్రివిక్రమ్ (Trivikram) దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. SSMB 28 గా పిలుచుకుంటున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జూలై నుంచి మొదలు కానుంది. దీని తర్వాత మహేశ్ .. రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ చిత్రం చేయబోతున్నాడు. ఇక ఈ గ్యాప్ లో మహేశ్ .. తన ఫ్యామిలీతో యథావిధిగా సమ్మర్ వెకేషన్స్‌కు పయనమయ్యారు. సాధారణంగా మహేశ్ సినిమా విడుదలైన తర్వాత ప్రతీ సారీ తన కుటుంబంతో వెకేషన్స్ కు వెళ్ళడం పరిపాటి. ఈ సారి కూడా మహేశ్ ఫ్యామిలీ వెకేషన్ ను ఎంజాయ్ చేస్తుండడం విశేషం.


ప్రస్తుతం మహేశ్‌బాబు (Maheshbabu) వెకేషన్ కు పయనమవుతున్న ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మహేశ్ భార్య నమ్రత శిరోద్కర్ (Namratha sirodkar), తనయుడు గౌతమ్ కృష్ణ (Gowtham Krishna), తనయ సితార (Sithara) సమ్మర్ వెకేషన్ ను ఫుల్‌గా ఎంజాయ్ చేయబోతున్నారు. ‘సరిలేరు నీకెవ్వురు’ చిత్రం విడుదలైన తర్వాత లాక్ డౌన్ రావడంతో వెకేషన్ కు వెళ్ళడం కుదరలేదు. అయితే ‘సర్కారువారి పాట’ చిత్రం షూటింగ్ బిగిన్ అవడానికి ముందు కూడా మహేశ్ అండ్ ఫ్యామిలీ దుబాయ్ వెకేషన్‌కు వెళ్ళారు. ఇప్పుడు మరోసారి ఈ ఫ్యామిలీ వెకేషన్ కు వెళ్ళడం అభిమానుల్ని ఆకట్టుకుంటోంది. అక్కడ నుంచి వచ్చిన తర్వాత SSMB 28 చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.  

Updated Date - 2022-05-22T19:10:12+05:30 IST