బెదిరింపులు రావడంతో Salman Khan కు భద్రత పెంపు

ABN , First Publish Date - 2022-06-07T01:18:02+05:30 IST

ప్రముఖ పంజాబీ గాయకుడు సిద్ధూ మూసే‌వాలా(Sidhu Moose Wala)ను అగంతకులు కాల్చి చంపిన సంగతి తెలిసిందే. కొంత మంది ఈ పాపులర్ సింగర్‌పై మే 29న కాల్పులు జరపడంతో అక్కడిక్కడే మృతి

బెదిరింపులు రావడంతో Salman Khan కు భద్రత పెంపు

ప్రముఖ పంజాబీ గాయకుడు సిద్ధూ మూసే‌వాలా(Sidhu Moose Wala)ను అగంతకులు కాల్చి చంపిన సంగతి తెలిసిందే. కొంత మంది ఈ పాపులర్ సింగర్‌పై మే 29న కాల్పులు జరపడంతో అక్కడిక్కడే మృతి చెందారు. ఈ ఘటనను మరచి పోకముందే ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ (Salman Khan), ఆయన తండ్రీ సలీం ఖాన్‌ (Salim Khan)కు ఓ బెదిరింపు లేఖ అందింది.


సల్మాన్ తండ్రి, ప్రముఖ స్క్రిప్ట్ రైటర్ సలీం ఖాన్ ఆదివారం మార్నింగ్ వాక్ చేస్తుండగా కొద్దిసేపు బ్రేక్ తీసుకున్నారు. ప్రతిరోజు లాగే బాంద్రా బ్యాండ్‌స్టాండ్ వద్ద ఓ బెంచీ మీద కూర్చున్నారు. ఆ సమయంలోనే బెదిరింపు లేఖ దొరికింది. ‘‘సిద్ధూ మూసేవాలా లానే నిన్ను, నీ కుమారుడిని చంపుతాం’’ అని ఆ బెదిరింపు లేఖలో ఉంది. అపరిచితుల వ్యక్తుల నుంచి బెదిరింపులు రావడంతోనే మహారాష్ట్ర హోంశాఖ  అప్రమత్తమయింది. ఈ ఘటనపై కేసును నమోదు చేసింది. సల్మాన్ ఖాన్, ఆయన కుటుంబానికి భద్రతను పెంచింది. ప్రస్తుతం పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. బాంద్రా ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. సిద్ధూ మూసేవాలా కేసులో లారెన్స్ బిష్ణోయ్‌ను మొదటి నిందితుడిగా పోలీసులు పేర్కొన్న సంగతి తెలిసిందే. కృష్ణ జింకను వేటాడినప్పటి నుంచి సల్మాన్ ఖాన్ కదలికలపై బిష్ణోయ్ తెగ వాసులు నిఘా ఉంచారు. గతంలోనే  సల్మాన్ ఖాన్‌ను చంపుతామంటూ వారు బెదిరించిన సంగతి తెలిసిందే.  



Updated Date - 2022-06-07T01:18:02+05:30 IST