కొత్త ఇంటిని అద్దెకు తీసుకున్న మాధురి దీక్షిత్ దంపతులు.. రెంట్ ఎంతో తెలిస్తే షాకే..

ABN , First Publish Date - 2022-03-22T21:57:06+05:30 IST

బాలీవుడ్ నటి మాధురి దీక్షిత్, ఆమె భర్త డా. శ్రీరామ్ నేనే ఇటీవలే ఓ కొత్త ఇంటిని అద్దెకు తీసుకున్నారు. ముంబైలోని ధనికులు ఉండే పోష్ లోకాలిటీ..

కొత్త ఇంటిని అద్దెకు తీసుకున్న మాధురి దీక్షిత్ దంపతులు.. రెంట్ ఎంతో తెలిస్తే షాకే..

బాలీవుడ్ నటి మాధురి దీక్షిత్, ఆమె భర్త డా. శ్రీరామ్ నేనే ఇటీవలే ఓ కొత్త ఇంటిని అద్దెకు తీసుకున్నారు. ముంబైలోని ధనికులు ఉండే పోష్ లోకాలిటీ అయిన వోర్లీ‌లో ఓ భవనంలో అపార్ట్‌మెంట్ ఉంది. 5500 చదరపు అడుగులు ఉన్న ఆ లగ్జరీ ఫ్లాట్ ఆ భవనంలోని 29వ ఫ్లోర్‌లో ఉంటుదంట. దీనికి సంబంధించిన పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దానికంటే ముందు ఆ ఫ్లాట్ రెంట్ చర్చకు కారణమయ్యింది. ఎందుకంటే ఆ ఇంటి అద్దె నెలకు అక్షరాలా రూ.12.5 లక్షలు. దీనికి సంబంధించిన లీజ్ అగ్రిమెంట్స్‌ని  ఈ జంట పూర్తి చేసిందంట.


మాధురి దంపతుల గురించి ఈ ఇంటి డిజైనర్ మాట్లాడుతూ.. ‘ఎంతో పద్ధతిగా ఉన్న మాధురి, శ్రీరామ్ ప్రవర్తన, ప్రాక్టికల్‌గా ఉండే వారి మాటతీరు చూసి నేను ఎంతో ఆశ్యర్యపోయాను. వారు ఇంటికి అనవరమైన మార్పులు చేయించకుండా.. ఆ ఇంటిని సాధ్యమైనంత త్వరగా అప్పగించాలని మాత్రమే కోరారు’ అని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా వారు ఉండబోయే ఇంటికి సంబంధించిన పిక్స్ సైతం ఆయన కంపెనీ సోషల్ మీడియా అకౌంట్‌లో అప్‌లోడ్ చేశాడు. అందులో వారు ఈ ఇంటికి ఎక్కువ మార్పులు చూచించకపోవడం తమ అదృష్టమని క్యాప్షన్ రాసుకొచ్చాడు.





Updated Date - 2022-03-22T21:57:06+05:30 IST