Macherla Niyojakagavargam: దర్శకుడిపై వివాదం..?
ABN , First Publish Date - 2022-07-27T15:48:05+05:30 IST
యూత్ స్టార్ నితిన్ (Nithin) నటించిన తాజా చిత్రం మాచర్ల నియోజకవర్గం (Macherla Niyojakagavargam). తాజాగా ఈ మూవీ డైరెక్టర్ ఎమ్ ఎస్ రాజశేఖర్ రెడ్డి (MS Rajashekhar Reddy) వివాదంలో చిక్కుకున్నారు.
యూత్ స్టార్ నితిన్ (Nithin) నటించిన తాజా చిత్రం మాచర్ల నియోజకవర్గం (Macherla Niyojakagavargam). తాజాగా ఈ మూవీ డైరెక్టర్ ఎమ్ ఎస్ రాజశేఖర్ రెడ్డి (MS Rajashekhar Reddy) వివాదంలో చిక్కుకున్నారు. గత ఏడాది చెక్, రంగ్ దే చిత్రాలతో వచ్చి ఆశించిన విజయాలను అందుకోలేకపోయాడు నితిన్. దాంతో ఈసారి ఎలాగైనా మంచి కమర్షియల్ హిట్ సాధించాలనే పట్టుదలతో మాచర్ల నియోజకవర్గం మూవీతో రాబోతున్నాడు. ప్రముఖ ఎడిటర్ అయిన ఎమ్ ఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా మారారు. అయితే, ప్రస్తుతం రాజశేఖర్ రెడ్డి గురించి ఓ నెటిజన్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ లు వైరల్ అవుతున్నాయి.
దర్శకుడు ఎమ్ ఎస్ రాజశేఖర్ రెడ్డి పేరుతో కొన్ని పోస్ట్ లు సోషల్ మీడియాలో దర్శనమివ్వడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఏపీలో ప్రధాన రాజకీయాలకు సంబంధించిన కులాలను కించపరుస్తూ... అసభ్యకరమైన పదాలను ఉపయోగిస్తూ... ప్రస్తుతం ఉన్న అధికార పక్ష కులాన్ని సపోర్ట్ చేస్తున్నట్టుగా ఈ పోస్ట్ లు కనిపించాయి. అయితే, ఇవి ఫేక్ పోస్టులని మాట్లాడుకుంటున్నవారూ ఉన్నారు. అంతేకాదు, వీటికి వివరణ ఇస్తూ.. దర్శకుడు రాజశేఖర్ రెడ్డి పెట్టిన పోస్ట్ కూడా దీనిలో ఉంది. ఫేక్ ఐడీతో ఫేక్ పర్సన్స్ పెట్టేవాటిని నమ్మవద్దంటూ ఆయన తెలిపారు.
ఇక ఇదే పోస్ట్ పై హీరో నితిన్ కూడా స్పందించారు. దీనికి సంబంధిచి నితిన్ కూడా దర్శకుడికి అండగా నిలిచి కామెంట్ పెట్టారు. "పాత పోస్ట్ లకు సంబధించిన స్క్రీన్ షార్ట్ ను జత చేసి..దానికి ఇలా ఓ నోట్ రాశాడు. "ఒక నకిలీ వ్యక్తి చేసిన ఫేక్ ట్వీట్ అనవసరమైన వివాదం సృష్టించింది. దురదృష్టవశాత్తు ఇది మిగతావారి మనోభావాలను దెబ్బతీసింది. ఇది చాలా విచారకరం. అంతేకాదు, ఈ పోస్ట్ అందరిని చాలా నిరాశపరిచింది. ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని నేను ఖండిస్తున్నాను''.. అని నితిన్ పోస్ట్లో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా, మాచర్ల నియోజకవర్గం మూవీ ఆగస్టు 12న భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. కృతి శెట్టి హీరోయిన్గా నటించింది.