టాలీవుడ్లో ఎంట్రీకి Vikram Director Lokesh Kanagaraj ప్లాన్.. హైదరాబాద్లో ఆ స్టార్ హీరో ఇంటికెళ్లి మరీ..
ABN , First Publish Date - 2022-06-17T15:26:03+05:30 IST
మానగరం, ఖైదీ, మాస్టర్ వంటి సినిమాలతో తమిళంతోపాటు తెలుగులోనూ గుర్తింపు పొందిన దర్శకుడు లోకేశ్ కనగరాజ్...
మానగరం, ఖైదీ, మాస్టర్ వంటి సినిమాలతో తమిళంతోపాటు తెలుగులోనూ గుర్తింపు పొందిన దర్శకుడు లోకేశ్ కనగరాజ్. ఎంతో టాలెంట్ ఉన్న ఈ యంగ్ డైరెక్టర్, లోకనాయకుడు కమల్ హాసన్ కాంబినేషన్లో వచ్చిన తాజా చిత్రం ‘విక్రమ్’. తమిళంతోపాటు తెలుగు, మలయాళం, కన్నడ, హిందీలో ఇటీవలే విడుదలైన ఈ మూవీ సూపర్ హిట్ టాక్ని సొంతం చేసుకుంది. దీంతో ఈ యువ దర్శకుడి క్రేజ్ పాన్ ఇండియా రేంజ్కి పెరిగిపోయింది. అంతేకాకుండా ఈ మూవీతో హాలీవుడ్ నిర్మాణ సంస్థ క్రియేట్ చేసిన ‘అవెంజర్స్’ సినిమాలలాగా ఓ ప్రత్యేక సినిమాటిక్ యూనివర్స్ని క్రియేట్ చేశాడు. దీంతో ఆయన తదుపరి చేసే సినిమాలపై భారీ క్రేజ్ ఏర్పడింది.
లోకేశ్ ప్రస్తుతం దళపతి విజయ్ హీరోగా ఓ సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత చేయబోయే సినిమాపై క్రేజ్ అప్డేట్ ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించిన టాలీవుడ్ యంగ్ హీరో రామ్ చరణ్తో ఓ సినిమా చేయనున్నాడనేది ఆ వార్తా సారాంశం. విక్రమ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ముగిసిన తర్వాత మ్యూజిక్ కంపోజర్ అనిరుధ్, లోకేశ్ కలిసి చెర్రీని హైదరాబాద్లోని ఆయన నివాసంలో కలిశారు. దీంతో వారిద్దరి కాంబినేషన్లో సినిమా రాబోతున్నట్లు.. కథా చర్చల్లో భాగంగా ఈ మీటింగ్ జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. ఆ సినిమాతో టాలీవుడ్లోకి అడుగుపెట్టేందుకు లోకేశ్ సిద్ధమవుతున్నట్లు వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇదే కనుక నిజమైతే రామ్ చరణ్ని లోకేశ్ ఏ అవతారం చూపిస్తాడోనని ఆయన ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. కాగా.. లోకేశ్ కనగరాజ్ విక్రమ్, ఖైదీ చిత్రాల మధ్య క్రాస్ఓవర్ ద్వారా ఇప్పటికే ఓ సినీ విశ్వాన్ని సృష్టించాడు. త్వరలో ఖైదీ 2, విక్రమ్ 3, అలాగే మరికొన్ని స్పిన్ ఆఫ్లు తెరకెక్కించే ఆలోచనలో ఉన్నట్లు లోకేశ్ ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. అలాగే సూర్యతోనూ ఓ మూవీ చేయనున్నట్లు తెలుస్తోంది.