మాట నిలబెట్టుకున్న Lock Upp Winner Munawar Faruqui.. ఆ యాసిడ్ బాధితురాలికి చెప్పినట్టుగానే..
ABN , First Publish Date - 2022-05-18T18:01:45+05:30 IST
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ మొట్టమొదటిసారి హోస్ట్గా వ్యవహరించిన రియాలిటీ షో ‘లాకప్’..
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ మొట్టమొదటిసారి హోస్ట్గా వ్యవహరించిన రియాలిటీ షో ‘లాకప్’. ప్రముఖ రియాలిటీ షో బిగ్బాస్ తరహాలో సాగిన ఈ షో ఇటీవలే మొదటి సీజన్ని పూర్తి చేసుకోగా.. ప్రముఖ నటుడు, స్టాండప్ కమెడియన్ మునావర్ ఫరూఖీ విజేతగా నిలిచాడు. ఈయన ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉన్నాడు. లాకప్ విజేత అయ్యినందుకు కాదు.. ఇచ్చినమాట నిలబెట్టుకున్నందుకు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా.. కంగనా రనౌత్ షోకి యాసిడ్ దాడికి గురైన పలువురు బాధితులు గెస్టులుగా వచ్చారు. ఆ సమయంలో వారి బాధలు షో కంటెస్టెంట్స్తోపాటు ప్రేక్షకులని కంటతడి పెట్టేలా చేశాయి. దీంతో యాసిడ్ దాడి బాధితురాలైన దౌలత్ బీ ఖాన్ని షో వెలుపల వ్యక్తిగతంగా కలుస్తానని మునావర్ మాట ఇచ్చాడు. అందరినీ ఆశ్చర్యపరుస్తూ.. తాజాగా మునావర్ తన మాట నిలబెట్టుకున్నాడు. దౌలత్ కలిసినప్పుడు దిగిన పిక్ని ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు. దానికి.. ‘దౌలత్ బీ ఎందరికో స్ఫూర్తి’ అంటూ రాసుకొచ్చాడు. దీంతో పలువురు నెటిజన్లు ఈ నటుడి ప్రశంసిస్తూ ట్వీట్స్ చేశారు.