ధోనీతో తన బ్రేకప్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన Laxmi Raai

ABN , First Publish Date - 2021-12-04T23:32:03+05:30 IST

భారత క్రికెట్ చరిత్రలో ఎమ్‌ఎస్. ధోనీకి తప్పకుండా ఒక పేజీ ఉంటుంది. ఇండియన్ క్రికెట్‌లో అనేక రికార్డులను అతడు

ధోనీతో తన బ్రేకప్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన Laxmi Raai

భారత క్రికెట్ చరిత్రలో ఎమ్‌ఎస్. ధోనీకి తప్పకుండా ఒక పేజీ ఉంటుంది. ఇండియన్ క్రికెట్‌లో అనేక రికార్డులను అతడు తిరగరాశాడు. గత ఏడాది ఇంటర్నేషనల్ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించాడు. ప్రస్తుతం తన విలువైన సమయాన్ని కుటుంబంతో గడుపుతున్నాడు. ధోనీకి సాక్షి సింగ్‌తో పెళ్లైయి దాదాపు పదేళ్లు గడిచింది. వారికి జీవా అనే కూతురు కూడా ఉంది. 


సాక్షిని పెళ్లి చేసుకోకముందు ధోని అనేకమందితో డేటింగ్ చేశాడని పుకార్లు షికార్లు కొట్టాయి. హీరోయిన్ లక్ష్మీరాయ్‌తో 2008-09లో డేటింగ్ చేశాడని మీడియా కోడై కూసింది. వీరిద్దరూ అనేకసార్లు మీడియా కంట కూడా పడ్డారు. ఇండియన్ ప్రీమీయర్ లీగ్ (ఐపీఏల్)‌లో మ్యాచ్ అనంతరం జరిగే నైట్ పార్టీలకు కూడా హాజరయ్యారు. తన స్నేహితుడైన సురేష్ రైనాతో కలిసి లక్ష్మీరాయ్ పుట్టినరోజు వేడుకలను ధోని సెలబ్రేట్ చేశాడు. ఐదు ఏళ్లు డేటింగ్ చేసిన అనంతరం వీరిద్దరూ విడిపోయారు. బ్రేకప్ గురించి ప్రశ్నించగా ఆమె ఒక ఇంటర్వ్యూలో సమాధానం ఇచ్చింది. ‘‘ ధోనీతో నా సంబంధం ఒక మచ్చలా ఉండిపోతుందని నేను ఆశిస్తున్నాను. కొన్ని ఏళ్ల వరకు ఆ మచ్చ మాయమవ్వదు ’’ అని లక్ష్మీరాయ్ పేర్కొంది. మేం విడిపోయి చాలా ఏళ్లు అయినప్పటికి అందరు ఈ విషయం కూడా మాట్లాడటం విచిత్రంగా ఉందని ఆమె వెల్లడించింది. 


ధోనీతో విడిపోక ముందు మీడియాకు ఆమె ఇంటర్వ్యూ ఇచ్చింది.  ‘‘ ధోని వజ్రం లాంటి వాడు. మంచి మనసు ఉన్నవాడు. ఏ అమ్మాయి అయినా సరే తప్పకుండా అతడిని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది ’’ అని ఆమె చెప్పింది.

Updated Date - 2021-12-04T23:32:03+05:30 IST