Rangamarthanda: లేటెస్ట్ అప్డేట్..
ABN , First Publish Date - 2022-06-17T14:12:13+05:30 IST
టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ (Krishna Vamsi) లాంగ్ గ్యాప్ తర్వాత రూపొందిస్తున్న చిత్రం 'రంగమార్తాండ' (Rangamarthanda).
టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ (KrishnaVamsi) లాంగ్ గ్యాప్ తర్వాత రూపొందిస్తున్న చిత్రం 'రంగమార్తాండ' (Rangamarthanda). తాజాగా ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు చిత్ర బృందం. ప్రస్తుతం ఆయన ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్లో బిజీగా ఉన్నారు. మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా (Ilaiyaraaja) బ్యాక్ గ్రౌండ్ స్కోరుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. ఈ సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ గురించి అప్ డేట్స్ ఇస్తూ..సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నారు కృష్ణవంశీ. ఈ క్రమంలోనే తాజా అప్డేట్ను ఇచ్చారు.
'రంగమార్తాండ' మూవీకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పనులు కూడా పూర్తి అయ్యాయని, అవుట్ పుట్ చాలా బాగా రావడం సంతోషంగా ఉందని తెలిపారు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయింది. ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు దాదాపు పూర్తయినట్టేనని సమాచారం. ఈ నేపథ్యంలోనే త్వరలోనే ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేయబోతున్నారట. ఇందులో విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ (Prakash Raj), రమ్యకృష్ణ (Ramyakrishna) ప్రధాన పాత్రల్లో.. అనసూయ భరద్వాజ్ (Anasuya), బ్రహ్మానందం, శివాత్మిక రాజశేఖర్, రాహుల్ సిప్లిగంజ్ ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
మరాఠిలో వచ్చి సూపర్ హిట్ సాధించిన నట సామ్రాట్ చిత్రానికి రంగ మార్తాండ అధికారిక రీమేక్ చిత్రం. కాగా, కృష్ణ వంశీ 2017లో సాయి ధరమ్ తేజ్, ప్రగ్యా జైస్వాల్, సందీప్ కిషన్, రెజీనా కసాండ్రా హీరోహీరోయిన్లుగా 'నక్షత్రం' సినిమాను రూపొందించారు. ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో చాలా గ్యాప్ తీసుకున్న ఆయన మళ్లీ నాలుగేళ్ల తర్వాత రంగమార్తాండ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. చూడాలి మరి ఈ సినిమాతో భారీ హిట్ అందుకొని మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కుతారేమో ఈ క్రియేటివ్ డైరెక్టర్.