Adipurush: కృతి సనన్ వల్లే టీజర్ లాంచ్ ఈవెంట్‌ ఆలస్యం..!

ABN , First Publish Date - 2022-10-05T21:58:29+05:30 IST

రామాయణాన్ని ఆధారంగా చేసుకుని రూపొందుతున్న సినిమా ‘ఆదిపురుష్’ (Adipurush). గ్లోబల్ స్టార్ ప్రభాస్ (Prabhas), కృతి సనన్ (Kriti Sanon) హీరో, హీరోయిన్‌గా నటిస్తున్నారు.

Adipurush: కృతి సనన్ వల్లే టీజర్ లాంచ్ ఈవెంట్‌ ఆలస్యం..!

రామాయణాన్ని ఆధారంగా చేసుకుని రూపొందుతున్న సినిమా ‘ఆదిపురుష్’ (Adipurush). గ్లోబల్ స్టార్ ప్రభాస్ (Prabhas), కృతి సనన్ (Kriti Sanon) హీరో, హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఓం రౌత్ (Om Raut) దర్శత్వం వహిస్తున్నాడు. సైఫ్‌అలీ ఖాన్ (Saif Ali Khan) కీలక పాత్రను పోషిస్తున్నాడు. ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా వచ్చే ఏడాది జనవరి 12న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ అక్టోబర్ 2న అయోధ్యలో టీజర్‌ను రిలీజ్ చేశారు. ఈ ఈవెంట్‌కు దాదాపుగా 10వేల మంది హాజరయ్యారు. యూట్యూబ్‌లో టీజర్‌ను రిలీజ్ చేసిన సమయానికే అయోధ్యలో ఈవెంట్ ప్రారంభం కావాలి. కానీ, కృతి సనన్ వల్ల ఈవెంట్ ఆలస్యమయిందని బీ టౌన్ మీడియా తెలుపుతోంది. 


‘ఆదిపురుష్’ టీజర్‌ను యూట్యూబ్‌లో 7.11గంటలకు విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. అదే సమయానికి అయోధ్య‌లో టీజర్ లాంచ్ ఈవెంట్ ప్రారంభం కావాలి. కానీ, ముంబై నుంచి అయోధ్యకు బయలుదేరిన ప్లైట్‌లో కృతి సనన్ లగేజీని విమానయాన సిబ్బంది లోడ్ చేయలేదు. కాస్టూమ్స్‌తో పాటు పవర్ బ్యాంక్‌ను కృతి  ఓ బ్యాగ్‌లో పెట్టుకుంది. పవర్ బ్యాంక్‌ను పెట్టుకుందనే కారణంతో ఆమె లగేజీకి విమానాశ్రయంలోని సిబ్బంది అడ్డు చెప్పారు. దీంతో కాస్టూమ్స్ లేకుండానే కృతి విమానమెక్కింది. అనంతరం కొంచెం సమయం తీసుకుని వేరే దుస్తులతో టీజర్ లాంచ్ ఈవెంట్‌లో మనకు దర్శనమిచ్చింది. అందువల్లే అనుకున్న సమయానికి టీజర్ లాంచ్ ఈవెంట్‌ను మొదలుపెట్టలేదని బాలీవుడ్ మీడియా తెలుపుతోంది. ‘ఆది‌పురుష్’ ను పాన్ ఇండియాగా తెరకెక్కించారు. రూ.500కోట్ల బడ్జెట్‌తో రూపొందించారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్, లంకేశ్‌గా సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. ఈ మూవీని త్రీడీ, ఐ మ్యాక్స్ త్రీడీలోను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. 



Updated Date - 2022-10-05T21:58:29+05:30 IST