ఏప్రిల్ 3 కోసం ఎదురు చూస్తున్నానంటున్న కృతి శెట్టి.. కారణమేంటంటే..

ABN , First Publish Date - 2022-04-01T22:32:16+05:30 IST

ప్రతి సినిమాలోను వైవిధ్యం చూపిస్తూ కొత్త రకం పాత్రలను ఎంచుకుంటున్న కథానాయిక కృతి శెట్టి

ఏప్రిల్ 3 కోసం ఎదురు చూస్తున్నానంటున్న కృతి శెట్టి.. కారణమేంటంటే..

ప్రతి సినిమాలోను వైవిధ్యం చూపిస్తూ కొత్త రకం పాత్రలను ఎంచుకుంటున్న కథానాయిక కృతి శెట్టి. ‘ఉప్పెన’ చిత్రంలో బేబమ్మగా నటించి ప్రేక్షకులను అలరించింది. ‘శ్యామ్ సింగరాయ్’, ‘బంగార్రాజు’ సినిమాల్లో తన నటనతో అభిమానులను మెప్పించింది. సూర్య హీరోగా నటిస్తున్న ఓ చిత్రంలో కృతి హీరోయిన్‌గా ఎంపికైంది. ఈ మూవీని కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ బాలా తెరకెక్కించనున్నాడు. ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. తాజాగా కృతి శెట్టి మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో ఆసక్తికర కబుర్లను అభిమానులకు తెలిపింది. 


ఏప్రిల్ 3కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నానని కృతి శెట్టి తెలిపింది. ఎందుకంటే ఆ రోజు నుంచే కన్యాకుమారిలో కృతి పైన సన్నివేశాలను తెరకెక్కించనున్నారు. మొదటి రోజు షూటింగ్ కోసం ఆత్రుతగా వేచి చూస్తున్నట్టు ఈ అందాల భామ పేర్కొంది. తాను సూర్యకు పెద్ద అభిమానినని ఆమె చెప్పుకొచ్చింది. సూర్య హీరోగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే కన్యాకుమారిలో ప్రారంభమైంది. టాలీవుడ్‌లో కృతి శెట్టి వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’, ‘మాచర్ల నియోజకవర్గం’, ‘ది వారియర్’ తదితర ప్రాజెక్టుల్లో కీలక పాత్రలు పోషిస్తుంది.

Updated Date - 2022-04-01T22:32:16+05:30 IST