పవర్ స్టార్కి కథ సిద్ధంగా ఉంది: కొరటాల శివ
ABN , First Publish Date - 2022-04-28T03:30:34+05:30 IST
పవర్ స్టార్ పవన్ కల్యాణ్కు కథ సిద్ధంగా ఉందని అన్నారు సక్సెస్ ఫుల్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ. ఆయన దర్శకత్వంలో రూపొందిన ‘ఆచార్య’ చిత్రం ఏప్రిల్ 29న గ్రాండ్గా విడుదల
పవర్ స్టార్ పవన్ కల్యాణ్కు కథ సిద్ధంగా ఉందని అన్నారు సక్సెస్ ఫుల్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ. ఆయన దర్శకత్వంలో రూపొందిన ‘ఆచార్య’ చిత్రం ఏప్రిల్ 29న గ్రాండ్గా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా బుధవారం మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘ఆచార్య’ చిత్ర విశేషాలతో పాటు, తదుపరి ఆయన చేయబోయే చిత్రాల వివరాలను కూడా కొరటాల తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘మొదటి నుండి నేను ఎక్కువగా శ్రద్ధ పెట్టేది కథపైనే. కథ బాగుంటే.. ప్రేక్షకుల నుండి సినిమాపై వచ్చే ప్రశంసలు వస్తూనే ఉంటాయి. ‘ఆచార్య’కు మంచి కథ కుదిరింది. సినిమా చూస్తున్న ప్రేక్షకులు చక్కగా ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎలా అయితే ఎక్జయిటింగ్గా ఎదురుచూస్తున్నారో.. నేను కూడా అలానే వేచి చూస్తున్నాను. ఇక నా తదుపరి చిత్రం తారక్తో ఉంటుంది. పొలిటికల్ నేపథ్యంలో ఉంటుందని అంతా అనుకుంటున్నారు. అది నిజం కాదు. నా కెరియర్లో ఇప్పటి వరకు రాయని పరిధిలో తారక్తో చేసే సినిమా కథ ఉంటుంది. చాలా వైవిధ్యంగా ఉంటుంది. ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. ఈ సినిమా కాకుండా.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్గారి కోసం ఓ కథ సిద్ధంగా ఉంది. అది ఆయన కోసమే రాసి పెట్టుకున్నాను. ఇంకా ప్రభాస్తో కూడా ఓ సినిమా ఉంటుంది. అలాగే రామ్ చరణ్తో మళ్లీ సినిమా ఎప్పుడైనా ఉండొచ్చు..’’ అని కొరటాల శివ చెప్పుకొచ్చారు.