మరోసారి హీరోయిన్‌తో ప్రేమలో పడ్డ శింబు.. ఒకే ఇంటిలో నివసిస్తున్న జంట.. త్వరలోనే పెళ్లి ..?

ABN , First Publish Date - 2022-01-08T02:34:06+05:30 IST

మన్మథుడు సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు చేరువైన నటుడు శింబు. అనంతరం స్థాయికి తగ్గ హిట్ పడకపోవడంతో చతికిల పడ్డాడు

మరోసారి హీరోయిన్‌తో ప్రేమలో పడ్డ శింబు.. ఒకే ఇంటిలో నివసిస్తున్న జంట.. త్వరలోనే పెళ్లి ..?

‘‘ మన్మథుడు ’’ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు చేరువైన నటుడు శింబు. అనంతరం స్థాయికి తగ్గ హిట్ పడకపోవడంతో చతికిల పడ్డారు. తాజాగా అతడు హీరోగా నటించిన సినిమా ‘‘ మానాడు’’.  టైమ్ లూప్ బేస్‌డ్ థ్రిల్లర్‌గా ఆ చిత్రం తెరకెక్కింది. ఆ సినిమా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. ఓటీటీలోను దూసుకుపోతోంది. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించారు. కల్యాణి ప్రియదర్శన్, ఎస్ జే. సూర్య కీలక పాత్రల్లో నటించారు.  


స్టార్ హీరో శింబు మరోసారి ప్రేమలో పడ్డారని కోలీవుడ్‌లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. గతంలో నయనతార, హన్సిక‌లతో ఆ హీరో ప్రేమయాణాన్ని కొనసాగించారు. అనివార్య కారణాల వల్ల ఆ బంధాన్ని పెళ్లి పీటల వరకు తీసకెళ్లలేకపోయారు. అయితే, మరోసారి అతడు ప్రేమలో పడ్డారని తెలుస్తోంది. నిధి అగర్వాల్‌తో డేటింగ్ చేస్తున్నట్టు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈశ్వరన్ సినిమాలో శింబు, నిధి అగర్వాల్ కలిసి నటించారు. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరికి పరిచయం ఏర్పడినట్టు సమాచారం. అనంతరం ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారినట్టు కోలీవుడ్ మీడియా తెలుపుతోంది. 


గత 2ఏళ్లుగా ఈ జంట డేటింగ్ చేస్తుందని కోలీవుడ్ పత్రికల్లో కథనాలు వెలువడుతున్నాయి. చెన్నైలో ఒకే ఇంటిలో వీరిద్దరూ కలిసి నివసిస్తున్నట్టు కోలీవుడ్ మీడియా తెలుపుతోంది. త్వరలోనే వీరు పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఆ పుకార్లపై శింబు, నిధి అగర్వాల్ ఇప్పటి వరకు స్పందించలేదు. 

Updated Date - 2022-01-08T02:34:06+05:30 IST