కొడుకుతో ఫొటో తీసుకున్న ధనుష్.. దాంపత్య జీవితానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంటున్న నెటిజన్లు..!

ABN , First Publish Date - 2022-02-17T01:29:26+05:30 IST

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, సూపర్ స్టార్ రజినీకాంత్ కుమార్తె ఐశ్వర్య తమ వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతున్నట్టు

కొడుకుతో ఫొటో తీసుకున్న ధనుష్.. దాంపత్య జీవితానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంటున్న నెటిజన్లు..!

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, సూపర్ స్టార్ రజినీకాంత్ కుమార్తె ఐశ్వర్య తమ వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతున్నట్టు కొన్ని రోజుల క్రితమే ప్రకటించారు. పెళ్లి అయిన 18ఏళ్ల అనంతరం విడాకులు తీసుకుంటున్నట్టు సోషల్ మీడియాలో వీరిద్దరూ వేర్వేరుగా వెల్లడించారు. అనంతరం ధనుష్, ఐశ్వర్య తమ పనుల్లో బిజీ అయిపోయారు. ఈ దంపతుల మధ్య వివాదాలను పరిష్కరించడానికి రజినీకాంత్, లత రజినీకాంత్, కస్తూరి రాజా, సెల్వరాఘవన్ తదితరులెందరో ప్రయత్నించారని కోలీవుడ్ మీడియా తెలుపుతోంది. 


విడాకుల ప్రకటన తర్వాత సైలెంట్‌గా ఉన్న ధనుష్.. చాలా రోజుల తర్వాత తొలిసారిగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. తన కొడుకు యాత్రాతో తీసుకున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ ఫొటోలో యాత్రా, రజినీ స్టైల్‌లో గాల్లోకి జుట్టును లేపాడు. ‘‘గతంలో ఈ స్టైల్‌ని ఎక్కడో చూశాను’’ అని ధనుష్ తన పోస్ట్‌లో పేర్కొన్నాడు. దీంతో ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విపరీతంగా ట్రెండ్ అవుతోంది. దాదాపుగా మూడు లక్షల మంది ఈ పిక్‌ను లైక్ చేశారు. ఈ ఫొటోను పోస్ట్ చేయడంతోనే.. ఐశ్వర్యతో దాంపత్య జీవితాన్ని తిరిగి ప్రారంభించడానికి ధనుష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని నెటిజన్లు అంటున్నారు. ప్రస్తుతం సెల్వ రాఘవన్ తెరకెక్కించే  ‘నానే వరువెన్’ షూటింగ్‌లో ధనుష్ పాల్గొంటున్నారు. ఈ మూవీ షూటింగ్ ఊటీలోనే జరుగుతుంది. ధనుష్, యాత్రాతో తీసుకున్న ఫొటో ఊటీలోనే క్లిక్‌మనిపించినట్టు తెలుస్తోంది.



Updated Date - 2022-02-17T01:29:26+05:30 IST