ఐశ్వర్యను ‘ఫ్రెండ్’ అని సంబోధిస్తూ పోస్ట్ పెట్టిన హీరో ధనుష్

ABN , First Publish Date - 2022-03-18T02:28:55+05:30 IST

సూపర్ స్టార్ రజినీకాంత్ కూతురు ఐశ్వర్య, కోలీవుడ్ స్టార్ హీరో

ఐశ్వర్యను ‘ఫ్రెండ్’ అని సంబోధిస్తూ పోస్ట్ పెట్టిన హీరో ధనుష్

సూపర్ స్టార్ రజినీకాంత్ కూతురు ఐశ్వర్య, కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ విడాకులు తీసుకుంటున్నట్టు ఈ ఏడాది జనవరి 17న ప్రకటించారు. 18ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నట్టు వీరిద్దరు సోషల్ మీడియాలో వేర్వేరుగా వెల్లడించారు. అనంతరం తమ సినిమా పనుల్లో వీరిద్దరూ బిజీ అయిపోయారు.  


తాజాగా ఐశ్వర్య ‘పాయని’ అనే మ్యూజిక్ వీడియోకు దర్వకత్వం వహించడంతో పాటు, నిర్మాతగా కూడా వ్యవహరించింది. ఈ పాటను అనిరుధ్ ఆలపించాడు. అంకిత్ తివారీ సంగీతం అందించాడు. ఈ మ్యూజిక్ వీడియో నేడు విడుదలైంది. రిలీజ్ అయిన కాసేపటికే నెట్టింట హల్‌‌చల్ చేయడం మొదలుపెట్టింది. ఈ మ్యూజిక్ వీడియోకు ధనుష్ కూడా ఫిదా అయ్యాడు. ఐశ్వర్యకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టాడు. ఆ పోస్ట్‌లో ఐశ్వర్యను ‘ఫ్రెండ్’ అని సంబోధించాడు.  ‘‘నీ మ్యూజిక్ వీడియోకి కంగ్రాట్స్ మై ఫ్రెండ్’’ అని ధనుష్ ట్విట్టర్‌లో మెసేజ్ పోస్ట్ చేశాడు. ధనుష్ ఈ ట్వీట్ చేయగానే హీరో అభిమానులందరూ సంతోషంలో మునిగిపోయారు. ధనుష్ ఈ ట్వీట్ చేయడంతోనే.. దంపతులుగా వీరు విడిపోయినప్పటికీ ఇద్దరి మధ్య మంచి ఫ్రెండ్ షిప్ ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కొన్నిరోజుల క్రితం ధనుష్ సోదరుడు సెల్వ రా‌ఘవన్‌ను ప్రశంసిస్తూ ఐశ్వర్య పోస్ట్ పెట్టిన సంగతి అభిమానులందరికీ తెలిసిందే. ఈ మ్యూజిక్ వీడియోలో టాలీవుడ్ టాప్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ నటించడం విశేషం. ఈ పాట తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదలైంది. 


ధనుష్‌తో ఐశ్వర్యకు 2004 నవంబర్ 18న వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నట్టు కొన్ని రోజుల క్రితం వీరిద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో విడివిడిగా ఓ ప్రకటనను విడుదల చేశారు. ‘‘18ఏళ్ల పాటు స్నేహితులుగా, భార్యభర్తలుగా, తల్లిదండ్రులుగా మా ప్రయాణాన్ని కొనసాగించాం. ప్రస్తుతం మేం వేర్వేరు దారుల్లో ప్రయాణించాలని నిర్ణయించుకున్నాం. వ్యక్తిగతంగా సమాయాన్ని వెచ్చించాలనుకుంటున్నాం. దయచేసి మా నిర్ణయాన్ని గౌరవించండి’’ అని ధనుష్ అప్పట్లో ట్విట్టర్‌లో ఓ పోస్ట్ పెట్టాడు.



Updated Date - 2022-03-18T02:28:55+05:30 IST