కామన్ ఫ్రెండ్ ఇచ్చిన పార్టీకి హాజరైన ధనుష్, ఐశ్వర్య.. అక్కడ ఏం జరిగిందంటే..?

ABN , First Publish Date - 2022-03-02T01:51:25+05:30 IST

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, సూపర్ స్టార్ రజినీకాంత్ కుమార్తె

కామన్ ఫ్రెండ్ ఇచ్చిన పార్టీకి హాజరైన ధనుష్, ఐశ్వర్య.. అక్కడ ఏం జరిగిందంటే..?

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, సూపర్ స్టార్ రజినీకాంత్ కుమార్తె ఐశ్వర్య.. తమ వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతున్నట్టు కొన్ని రోజుల క్రితమే ప్రకటించారు. పెళ్లి అయిన 18ఏళ్ల అనంతరం విడాకులు తీసుకుంటున్నట్టు సోషల్ మీడియాలో వీరిద్దరూ వేర్వేరుగా వెల్లడించారు. అనంతరం ధనుష్, ఐశ్వర్య తమ పనుల్లో బిజీ అయిపోయారు. ఈ దంపతుల మధ్య వివాదాలను పరిష్కరించడానికి ఇద్దరి తరఫు బంధువులు ప్రయత్నించినప్పటికీ అది సఫలం కాలేదని తెలుస్తోంది.  


ధనుష్ తండ్రి కస్తూరి రాజా కొన్ని రోజుల క్రితం మీడియాతో మాట్లాడారు. ఈ దంపతులు భిన్నాభిప్రాయాలను పరిష్కరించుకుని త్వరలోనే కలసిపోతారని తెలిపారు. త్వరలోనే అంతా శుభవార్త వింటారని ప్రకటించారు. ప్రస్తుతం ధనుష్ ‘సార్’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఐశ్వర్య కూడా సినిమా పనుల్లో బిజీగా ఉంది. ఓ పాట షూటింగ్ నిమిత్తం హైదరాబాద్‌లోనే ఆమె కూడా ఉంది. ఇద్దరూ ఒకే ప్రాంతం, ఒకే హోటల్‌లో ఉన్నప్పటికీ ఒకరినొకరు కలసి మాట్లాడుకోలేదు. ఈ మధ్య ధనుష్, ఐశ్వర్య ఓ కామన్ ఫ్రెండ్ ఇచ్చిన పార్టీకి హాజరయ్యారట. ఈ పార్టీ చెన్నైలో జరిగినట్లు తెలుస్తోంది. పార్టీకి వచ్చిన అతిథులంతా వీరిద్దరూ మాట్లాడుకుంటారమోనని ఆసక్తిగా ఎదురు చూశారట. కానీ, ఇక్కడ కూడా ఒకరిని మరొకరు పట్టించుకోలేదని కోలీవుడ్ మీడియా తెలుపుతోంది.

Updated Date - 2022-03-02T01:51:25+05:30 IST