ఆ హీరో 2 గంటలు మాత్రమే పడుకునేవాడంటోన్న Kiara Advani

ABN , First Publish Date - 2022-05-15T02:11:57+05:30 IST

‘భూల్ భులయ్యా 2’ సినిమాతో త్వరలో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయబోతోంది కియారా అడ్వాణీ. అయితే, ఆమె గతంలో టాలెంటెడ్ యాక్టర్ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తో స్క్రీన్ షేర్ చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. దివంగత నటుడితో కియారా ‘ఎంఎస్ ధోనీ’ బయోపిక్ చేసింది. అప్పటి తన అనుభవాల్ని తాజాగా ఆమె జ్ఞాపకం చేసుకుంది.

ఆ హీరో 2 గంటలు మాత్రమే పడుకునేవాడంటోన్న Kiara Advani

‘భూల్ భులయ్యా 2’ సినిమాతో త్వరలో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయబోతోంది కియారా అడ్వాణీ. అయితే, ఆమె గతంలో టాలెంటెడ్ యాక్టర్ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తో స్క్రీన్ షేర్ చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. దివంగత నటుడితో కియారా ‘ఎంఎస్ ధోనీ’ బయోపిక్ చేసింది. అప్పటి తన అనుభవాల్ని తాజాగా ఆమె జ్ఞాపకం చేసుకుంది. 


‘ఎంఎస్ ధోనీ’ సినిమా షూటింగ్ అయ్యాక ఓ రోజు సుశాంత్, కియారా ఉదయం 4 గంటల ఫ్లైట్ కోసం రాత్రంతా ఎదురు చూడాల్సి వచ్చిందట. ఆ సమయంలో కబుర్లలో మునిగిపోయిన సుశాంత్, కియారా ఎన్నో విషయాలు, విశేషాలు పంచుకున్నారట. చాలా సేపు మాట్లాడుకున్న తరువాత ‘‘ఏదో ఒక రోజు ఎవరో ఒకరు నీ బయోపిక్ తీయాలి...’’ అందట సుశాంత్ తో కియారా! అంతలా సుశాంత్ జీవిత విశేషాలు, అతడి మాటలు, అతడి వ్యక్తిత్వం ఆమెను ఆకట్టుకున్నాయట!


సుశాంత్ గురించి చాలా విషయాలు చెప్పిన కియారా అడ్వాణీ అతడి ‘నిద్ర’ గురించి కూడా ఆశ్చర్యకర విషయం బయట పెట్టింది. సుశాంత్... మనుషులకి కేవలం రోజుకి 2 గంటల నిద్ర మాత్రమే చాలు అనుకునేవాడట! అంతే కాదు, అతను రెండే గంటలు నిద్రించి కూడా మర్నాడు ఉత్సాహంగా సెట్ మీదకు వచ్చేవాడని చెప్పింది కియారా! 

Updated Date - 2022-05-15T02:11:57+05:30 IST