మీరు ఏ దుస్తులను ధరించినా నెటిజన్స్ ట్రోల్ చేస్తారంటున్న Kiara Advani
ABN , First Publish Date - 2021-12-26T23:55:20+05:30 IST
భరత్ అనే నేను, వినయ విధేయ రామ సినిమాల ద్వారా టాలీవుడ్ ప్రేక్షకులకు చేరువైన నటి కియారా అడ్వాణీ. టాలీవుడ్తో పాటు బాలీవుడ్లోను
భరత్ అనే నేను, వినయ విధేయ రామ సినిమాల ద్వారా టాలీవుడ్ ప్రేక్షకులకు చేరువైన నటి కియారా అడ్వాణీ. టాలీవుడ్తో పాటు బాలీవుడ్లోను భిన్న రకాల చిత్రాల్లో ఆమె నటిస్తోంది. ఈ మధ్యనే షేర్ షా సినిమాలో ఆమె కనిపించింది. అమెజాన్ ప్రైమ్లో ఆ చిత్రం విడుదలైంది. ఆన్లైన్ ట్రోలింగ్ బారిన తను కూడా పడ్డానని ఆమె చెప్పింది. ట్రోలింగ్కు సెలెబ్రిటీలు స్పందిచనప్పటికీ వారి జీవితంపై ప్రభావం చూపిస్తుందని వివరించింది. తాజాగా ఆమె మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో అనేక విషయాలు చెప్పింది.
‘‘ మీరు ఎక్కడికి వెళ్లినా సరే ఫొటోగ్రాఫర్లు మీ ఫొటోను తీస్తారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు. ఆ ఫొటోల కింద అనేక మంది నెటిజన్స్ కామెంట్స్ చేస్తారు. మీరు ఎందుకు ఆ దుస్తులను ధరించారంటారు. మీరెందుకిలా ఉన్నారంటూ నెటిజన్స్ స్పందనను తెలుపుతారు ’’ అని కియారా అడ్వాణీ చెప్పింది.
‘‘ నేను ఒకసారి మీటింగ్కు వెళ్లే తొందరలో ఉన్నాను. మీటింగ్ దగ్గర ఫొటోగ్రాఫర్లు ఉంటారని నేను అనుకోలేదు. కానీ, కొంతమంది ఫొటోగ్రాఫర్లు అక్కడ ఎదురుపడ్డారు. ఒక ఫొటో ఇవ్వమని అడిగారు. నేను సమావేశానికి వెళ్లే తొందరలో ఫొటోను ఇవ్వలేదు. నేను ఆ వీడియోను ఇన్స్టాగ్రాంలో తర్వాత చూశాను. ఆ వీడియో కింద నెటిజన్స్ అసభ్యకరమైన కామెంట్స్ రాశారు ’’ అని ఆమె వివరించింది.