సిద్ధార్థ్ మల్హోత్రాతో బ్రేకప్‌పై రిపోర్టర్ ఇన్‌డైరెక్ట్ ప్రశ్న.. Kiara Advani ఇంటిలిజెంట్ రియాక్షన్ ఇదీ..

ABN , First Publish Date - 2022-04-27T18:22:17+05:30 IST

‘భరత్ అనే నేను’ సినిమాతో టాలీవుడ్‌లో గుర్తింపు పొందిన బాలీవుడ్ నటి కియారా అడ్వాణీ. ఈ హీరోయిన్ హిందీతోపాటు..

సిద్ధార్థ్ మల్హోత్రాతో బ్రేకప్‌పై రిపోర్టర్ ఇన్‌డైరెక్ట్ ప్రశ్న.. Kiara Advani ఇంటిలిజెంట్ రియాక్షన్ ఇదీ..

‘భరత్ అనే నేను’ సినిమాతో టాలీవుడ్‌లో గుర్తింపు పొందిన బాలీవుడ్ నటి కియారా అడ్వాణీ. ఈ హీరోయిన్ హిందీతోపాటు తెలుగులోనూ వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. బాలీవుడ్ యువ నటుడు కార్తీక్ ఆర్యన్‌తో కలిసి ఈ భామ నటించిన తాజా హిందీ మూవీ ‘భూల్ భులయ్యా 2’. త్వరలో విడుదల కానున్న ఈ చిత్ర ప్రమోషన్స్‌లో మూవీ టీం బిజీగా ఉంది. అందులో భాగంగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో సిద్ధార్థ్ మల్హోత్రాతో బ్రేకప్‌ గురించి కియారాకు ఓ ఇన్‌డైరెక్ట్ ప్రశ్న ఎదురైంది. దాంతో నటి ఘాటుగా సమాధానం ఇచ్చింది.


ఆ ఇంటర్వ్యూలో ఓ విలేకరి ‘విలేకరి మీరు ఎవరినీ మర్చిపోవాలని అనుకుంటున్నారు’ అని అడిగాడు. దానికి సమాధానమిస్తూ.. ‘నా జీవితంలో నేను కలిసిన ప్రతి వ్యక్తి నాకు ముఖ్యమే. కాబట్టి ఎవరినీ మర్చిపోవాల్సిన అవసరం లేదు’ అంటూ కియారా ఘాటుగా స్పందించింది. ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ఎంతోమంది నెటిజన్లు ఈ వీడియోపై రకరకాలుగా స్పందిస్తున్నారు. 


‘ఎంతో ఇబ్బందికర ప్రశ్న అడిగారు కదా’ అని ఓ నెటిజన్.. ‘ఎంత తెలివితక్కువ ప్రశ్న, కియారా ఇంటిలిజెంట్‌గా సమాధానం చెప్పింది. నటిగా ఎవరి పేరు చెప్పాల్సిన పని లేదు’ మరో నెటిజన్ రాసుకొచ్చాడు. ‘పరోక్షంగా సిద్ధార్థ్‌తో బ్రేకప్ అయ్యిందా లేదా అని మీడియా వారు అడుగుతున్నారు’, ‘పరోక్షంగా వ్యక్తిగత ప్రశ్నలు వేస్తున్నారు’ అంటూ మరికొందరు రాసుకొచ్చారు.



Updated Date - 2022-04-27T18:22:17+05:30 IST