ఆ హీరోతో అద్భుతంగా రొమాన్స్ చేస్తారని చెప్పగా ఆసక్తికర సమాధానం చెప్పిన Kiara Advani

ABN , First Publish Date - 2021-10-10T23:56:09+05:30 IST

అందంతో పాటు అభినయంతో ఆకట్టకునే నటి కియారా అడ్వాణీ. భరత్ అనే నేను చిత్రంలో మహేశ్ బాబు సరసన నటించి టాలీవుడ్‌కు పరిచయమయింది. వినయ విధేయ రామ, కలంక్, కబీర్ సింగ్

ఆ హీరోతో అద్భుతంగా రొమాన్స్ చేస్తారని చెప్పగా ఆసక్తికర సమాధానం చెప్పిన Kiara Advani

అందంతో పాటు అభినయంతో ఆకట్టకునే నటి కియారా అడ్వాణీ. భరత్ అనే నేను చిత్రంలో మహేశ్ బాబు సరసన నటించి టాలీవుడ్‌కు పరిచయమయింది. వినయ విధేయ రామ, కలంక్, కబీర్ సింగ్ తదితర చిత్రాల్లో నటించి అన్ని భాషాల ప్రేక్షకులకు దగ్గరైంది. ఈ మధ్య ఆమె బాలీవుడ్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది.  సిద్దార్థ్, కియారా జంట వెండితెరపై అద్భుతంగా ఉంటుందని మీడియా కితాబునివ్వగా ఆమె ఆసక్తికర సమాధానం చెప్పింది.


కియారా గత కొంతకాలంగా సిద్దార్థ్ మల్హోత్రాతో డేటింగ్ చేస్తున్నట్టు బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది.  అందుకు ఆమె స్పందిస్తూ..‘‘ కథ డిమాండ్ చేసిన మేరకే మేం నటిస్తాం. వెండితెరపై ఎవరు ఎటువంటి కెమిస్ట్రీని క్రియేట్ చేయలేరు. స్ర్కిఫ్ట్‌లో లేనిది ఏ ఇద్దరూ నటులు కూడా చేయరు. దర్శకుడు చెప్పినట్టుగా మాత్రమే మేం చేస్తాం ’’ అని స్పష్టం చేసింది. ప్రస్తుతం వీరిద్దరూ కిలిసి షేర్ షా మూవీలో నటిస్తున్నారు.


నటుడైన సిద్దార్థ మల్హోత్రాను ఆమె ప్రశంసించింది. అతడు మంచి నటుడని చెప్పింది. తమ జీవితంలో చోటు చేసుకున్న అనుభవాలతోనే మేం అంత బాగా నటించగలుగుతామని తెలిపింది. దర్శకులు ఎప్పుడు మంచి సంబంధాలు ఉన్న నటీనటులను ఎంపిక చేసుకోవడానికి ప్రయత్నిస్తారని అభిప్రాయపడింది. సిద్దార్థ్ మల్హోత్రా తనకు సన్నిహిత మిత్రుడిని గతంలోను కియారా చెప్పింది. తనకు చాలా తక్కువ మంది స్నేహితులు ఉంటారని చేతి వేళ్ల మీద వారిని లెక్కబెట్టొచని వివరించింది. తన సన్నిహిత మిత్రులతో సమయాన్ని వెచ్చించడానికి వెనుకాడబోనని స్పష్టం చేసింది. కియారా ప్రస్తుతం షేర్ షా, బూల్ బులయ్యా-2, శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ సరసన నటిస్తోంది.

Updated Date - 2021-10-10T23:56:09+05:30 IST