‘లెజెండ్’ చిరుని కలిసిన ప్రతీసారి..: ఖుష్బూ

ABN , First Publish Date - 2022-03-25T02:23:57+05:30 IST

‘లెజెండ్’ చిరంజీవిగారిని కలిసిన ప్రతీసారి చాలా సంతోషంగా ఉంటుందని ట్వీట్ చేశారు సీనియర్ నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బూ. మెగాస్టార్ చిరంజీవి ఇంటిలో చిరుతో కలిసి దిగిన ఫొటోని ఆమె ట్విట్టర్‌లో

‘లెజెండ్’ చిరుని కలిసిన ప్రతీసారి..: ఖుష్బూ

‘లెజెండ్’ చిరంజీవిగారిని కలిసిన ప్రతీసారి చాలా సంతోషంగా ఉంటుందని ట్వీట్ చేశారు సీనియర్ నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బూ. మెగాస్టార్ చిరంజీవి ఇంటిలో చిరుతో కలిసి దిగిన ఫొటోని ఆమె ట్విట్టర్‌లో షేర్ చేశారు. చిరంజీవి, ఖుష్బూ మంచి స్నేహితులనే విషయం తెలిసిందే. ఈ విషయం ప్రతి సంవత్సరం 80స్ బ్యాచ్ అంటూ వీరు నిర్వహించే గెట్‌టుగెదర్ తెలియజేస్తూనే ఉంటుంది.


‘‘లెజెండ్ చిరంజీవిగారిని ఎప్పుడూ కలిసినా చాలా సంతోషంగా ఉంటుంది. కుటుంబం, స్నేహం, మరెన్నో ఇతర విషయాలను ఆయనతో పంచుకోవడం జరిగింది. చిరంజీవి గొప్ప వ్యక్తి, అద్భుతమైన స్నేహితుడు..’’ అని ఖుష్బూ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మెగాభిమానులు ఈ ట్వీట్‌కు లైకుల మీద లైకులు కొడుతున్నారు. ఖుష్బూ విషయానికి వస్తే.. ఇటీవల శర్వానంద్ హీరోగా నటించిన ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటించారు. అంతకుముందు పవన్ కల్యాణ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ‘అజ్ఞాతవాసి’ చిత్రంలోనూ ఆమె నటించారు.



Updated Date - 2022-03-25T02:23:57+05:30 IST