KhushbuSundar: నటి ఖుష్బుకి మళ్లీ ఏమైంది?

ABN , First Publish Date - 2022-10-07T17:30:19+05:30 IST

సినీ నటి, రాష్ట్ర బీజేపీ మహిళా నేత ఖుష్బు సుందర్ (KhushbuSundar) మళ్ళీ ఆస్పత్రి పాలయ్యారు. ఇటీవల ఆమె తన బరువును గణనీయంగా తగ్గించుకున్న

KhushbuSundar: నటి ఖుష్బుకి మళ్లీ ఏమైంది?

సినీ నటి, రాష్ట్ర బీజేపీ మహిళా నేత ఖుష్బు సుందర్ (KhushbuSundar) మళ్ళీ ఆస్పత్రి పాలయ్యారు. ఇటీవల ఆమె తన బరువును గణనీయంగా తగ్గించుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆమె తరచూ అనారోగ్యం పాలవుతున్నారు. మంగళవారం చెన్నై నగరంలో జరిగిన తన సోదరుడు అబ్దుల్లా నటించిన సినిమా ఆడియో రిలీజ్‌ వేడుకలో పాల్గొన్నారు. ఆ రోజు ఎంతో హుషారుగా కనిపించిన ఆమె సాయంత్రానికి అస్వస్థతకు లోనై నగరంలోని అపోలో ఆస్పత్రిలో చేరారు. ఈ విషయాన్ని ఆమె తన ట్విట్టర్‌ ఖాతాలో వెల్లడించారు. ‘వెన్నెముక సమస్య కారణంగా ఆస్పత్రిలో చేరాను. ఒకటి రెండు రోజుల్లో మళ్ళీ రోజువారీ విధుల్లో పాలుపంచుకుంటాను’ అని ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం ఆమె హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయినట్లుగా తెలుస్తోంది. 


ఇక ఖుష్బు చేసిన ట్వీట్ చూసిన తర్వాత ఆమె అభిమానులు.. ఒక్కసారిగా.. ‘ఏమైంది మీకు.. గెట్ వెల్ సూన్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అభిమానులే కాదు.. గవర్నర్ తమిళ్ సై, మీనా, రాధ, అతిథి వంటి వారందరూ ట్విట్టర్ వేదికగా.. ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లుగా ట్వీట్ చేశారు. ఇలా వచ్చిన ప్రతి ట్వీట్‌కు ఖుష్బు సుందర్ ‘థ్యాంక్యూ’ (Thank You) అంటూ రిప్లయ్ ఇచ్చారు. ప్రస్తుతం ఆమె పూర్తి స్థాయిలో కోలుకున్నట్లుగా సమాచారం.



Updated Date - 2022-10-07T17:30:19+05:30 IST